Shashi Tharoor: గుజరాత్ ఎన్నికలు.. కాంగ్రెస్ ప్రచారానికి శశిథరూర్ దూరం..!
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ పార్టీ అధినాయకత్వం తీరుతో మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గుజరాత్ ఎన్నికల ప్రచారానికి ఆయన దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
దిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్కు.. పార్టీకి మధ్య బంధం బీటలువారుతోందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కీలకమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తే ప్రముఖుల జాబితాను కాంగ్రెస్ ఇటీవల విడుదల చేసింది. అయితే, ఇందులో థరూర్ పేరు లేకపోవడంతో ఆయన మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గుజరాత్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.
గుజరాత్లో ప్రచారానికి రావాల్సిందిగా కాంగ్రెస్ విద్యార్థి విభాగం శశిథరూర్ను ఆహ్వానించింది. అయితే, దాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతోనే థరూర్ ఈ ఆహ్వానాన్ని అంగీకరించలేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. థరూర్ను పార్టీ దూరం పెడుతోందంటూ వస్తోన్న వార్తలను కాంగ్రెస్ వర్గాలు తోసిపుచ్చాయి. ‘‘గతంలోనూ ఎన్నడూ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో థరూర్ పేరు లేదు’’ అని స్పష్టం చేశాయి.
గుజరాత్లో డిసెంబరు 1, 5వ తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రచారానికి గానూ 40 మంది ప్రముఖుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘేల్, సచిన్ పైలట్, జగదీశ్ ఠాకూర్, జిగ్నేశ్ మేవానీ, మాజీ సీఎంలు దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్, భూపిందర్ సింగ్ హుడా తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. అయితే, ప్రస్తుతం భారత్ జోడో యాత్రకు నేతృత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాలు దాదాపు లేవు. హిమాచల్ ఎన్నికల్లోనూ రాహుల్ ప్రచారం చేయలేదు. దీంతో ఆ బాధ్యతలను ప్రియాంక గాంధీ, భూపేశ్ బఘేల్ భుజానెత్తుకున్నారు.
గుజరాత్లో దాదాపు మూడు దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న భాజపా.. ఈసారి కూడా గెలవాలని పట్టుదలగా ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తుండగా.. పంజాబ్ విజయంతో జోరుమీదున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రంగంలోకి దిగింది. దీంతో ఈసారి గుజరాత్లో త్రిముఖ పోరు నెలకొంది. డిసెంబరు 8న గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ