Shivsena: యూపీ, గోవాలో శివసేన పోటీ.. సంజయ్ రౌత్ వెల్లడి
వచ్చే ఏడాది యూపీ, గోవా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు.
మంబయి: వచ్చే ఏడాది యూపీ, గోవా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు. యూపీలో తమ పార్టీకి కొన్ని రైతు సంఘాలు మద్దతిస్తాయని పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 80 నుంచి 100 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు రౌత్ చెప్పారు. గోవాలో 20 సీట్లలో అభ్యర్థులను నిలబెడతామన్నారు. ఉత్తర యూపీలో కొన్ని రైతు సంఘాలు తమకు మద్దతిస్తాయని చెప్పారు. మరికొన్ని చిన్న పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని వివరించారు. గోవాలో మహా వికాస్ అఘాడీ తరహా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా విజయ్ రూపాణీ రాజీనామా గురించి విలేకరులతో ప్రశ్నించగా.. అది భాజపా అంతర్గత విషయమని రౌత్ చెప్పారు. బయటి వ్యక్తుల జోక్యం సరికాదన్నారు. అయితే, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించడం భాజపాకు ఈ సారి అంత సులువేమీ కాదని అన్నారు. జాతీయ నాయకుడిగా ఎదిగేందుకు కావాల్సిన సామర్థ్యం ఉద్ధవ్ ఠాక్రేకు ఉందని మరో ప్రశ్నకు సంజయ్ రౌత్ సమాధానమిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయ రాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM