Siddaramaiah vs DK Shivakumar: సిద్ధా.. శివ.. ముఖ్యమంత్రి ఎవరు..?
కర్ణాటకలో కాంగ్రెస్కు ఓటర్లు విస్పష్టమైన మెజార్టీని అందించారు. దీంతో ముఖ్యమంత్రి స్థానానికి ఆ పార్టీలోని ఇద్దరు సీనియర్ నేతల మధ్య రేసు మొదలైంది. ఎన్నికల్లో విజయపథంలో నడిపిన వీరిద్దరిలో ఎవరి వైపు పార్టీ అధినాయకత్వం మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇంటర్నెట్డెస్క్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress)కు ఓటర్లు విస్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టారు. 2004 నుంచి ఆ పార్టీకి స్థాయి మెజార్టీ రావడం రెండోసారి. ఈ సారి ముఖ్యమంత్రి స్థానానికి పార్టీకి చెందిన దిగ్గజ నేతలు పోటీపడుతున్నారు. ఈ రేసులో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah), రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar)ముందంజలో ఉన్నారు. మోదీ-బసవరాజ్ బొమ్మైలతో కూడిన భాజపా డబులింజన్ సర్కారుకు నినాదానికి పోటీగా సిద్ధరామయ్య-డీకే శివకుమార్ ద్వయం ఎదురొడ్డి నిలిచి విజయం సాధించింది. ఇప్పుడు కన్నడనాట రాజకీయం ఉత్కంఠగా మారింది. 2013లో శివకుమార్కు తన మంత్రి వర్గంలో స్థానం ఇవ్వడానికి కూడా సిద్ధరామయ్య కొన్ని నెలలపాటు అంగీకరించలేదు. అప్పటికే డీకే కేపీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు కూడా. అలాంటిది ఇప్పుడు అతడితో కలిసి ముఖ్యమంత్రి పదవికి పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో వీరి సానుకూల ప్రతికూలాంశాలు..
కన్నడనాట అతిపెద్ద నాయకుడిగా సిద్ధరామయ్య..
కర్ణాటక రాజకీయాల్లో బీఎస్ యడియూరప్ప, సిద్ధరామయ్య అతిపెద్ద నాయకులు. ఇప్పుడు యడ్డీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. దీంతో సిద్ధరామయ్యకు ఎదురులేదు. ఇటీవల నిర్వహించిన ప్రతి ముందస్తు సర్వేలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అభ్యర్థిగా తొలిస్థానంలో నిలిచారు. ఈయనకు బాధ్యతలు అప్పగిస్తే ప్రజాతీర్పునకు అనుగుణంగా ఎంపిక చేసినట్లు అవుతుంది. కురబ సామాజిక వర్గానికి చెందిన సిద్ధరామయ్య కాంగ్రెస్ వ్యూహాలకు తగిన ‘అహంద’ (మైనార్టీ, బీసీ, ఎస్సీ) సామాజిక సమీకరణలకు కూడా అతికినట్లు సరిపోతారు. 2013లో ముఖ్యమంత్రిగా ఐదేళ్లపాటు నిరాటంకంగా పాలించిన అనుభవం కూడా ఆయనకు ప్లస్పాయింట్గా మారింది. దీంతోపాటు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం ఇదే చివరి సారి అని సిద్ధ ప్రకటించడంతో హస్తం అధినాయకత్వం ఆయనకు అవకాశం ఇవ్వవచ్చు. ముఖ్యంగా 2024 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధాని మోదీ జోరుకు అడ్డుకట్ట వేయాలంటే సిద్ధరామయ్య వంటి నేతకే కాంగ్రెస్ అధినాయకత్వం మొగ్గు చూపే అవకాశం ఉంది.
సిద్ధరామయ్యకు ప్రతికూలాంశాలు కూడా ఉన్నాయి. ఆయన పాలనలోని కీలక పోస్టింగ్ల్లో కురుబ సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తారనే అపవాదు ఉంది. ఇలాంటి పోకడలే వక్కలిగ, లింగాయత్ సామాజిక వర్గాలను పార్టీకి దూరం చేశాయని విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతోపాటు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న పీఎఫ్ఐ, ఎస్డీపీఐ కార్యకర్తలను విడుదల చేయడం విమర్శలకు దారితీసింది.
దూకుడుకు మారుపేరు డీకే..
కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఈ సారి ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో దూసుకు వెళుతున్నారు. తొమ్మిది సార్లు ఓటమి అనేది లేకుండా అసెంబ్లీకి ఎన్నికైన ఆయన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఈ రేసులో పోటీ పడుతున్నారు. ట్రబుల్ షూటర్గా ఆయనకు కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద పేరుంది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఒకప్పటి రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ రాజ్యసభ ఎన్నికలో శివకుమార్ కీలక పాత్ర పోషించారు. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన ఆంతరంగికుల్లో శివకుమార్ కూడా ఒకరు. ఆయనది వక్కలిగ సామాజిక వర్గం. కర్ణాటకలోనే అత్యంత సంపన్న రాజకీయ వేత్తగా ఆయన నిలిచారు. హస్తం పార్టీకి అవసరమైన విరాళాల సేకరణలో శివకుమార్దే కీలక పాత్ర. 2019 లోక్ సభ ఎన్నికల్లో కన్నడనాట ఉన్న 28 సీట్లలో కాంగ్రెస్ కేవలం ఒకటి మాత్రమే సాధించింది. అది కూడా డీకే సోదరుడు సురేష్ గెలిచిన స్థానం. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. దర్యాప్తు సంస్థల దాడులు, అరెస్టులకు ఎదురొడ్డి నిలిచి 2023లో పార్టీకి అధికారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు.
తాజాగా ముఖ్యమంత్రి పీఠం అందుకోవడానికి ఆ కేసులే అడ్డుగా నిలిచే అవకాశం ఉంది. ఆయనపై సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలు పలు కేసులు నమోదు చేశాయి. 104 రోజులు తిహాడ్ జైల్లో గడిపివచ్చారు. ఇప్పుడు ఆయన సీఎం పీఠం ఎక్కితే పాత కేసుల్లో విచారణలు సమయంలో పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయనే భయాలున్నాయి.
కాంగ్రెస్ పార్టీ వీరిద్దరు కాకుండా మూడో వ్యక్తిని కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి పరిశీలించే అవకాశాలు లేకపోలేదు. మాజీ ఉపముఖ్యమంత్రి జి.పరమేశ్వర వంటి నేతల పేర్లు కూడా ఈ రేసులో వినిపిస్తున్నాయి. పరమేశ్వర రాష్ట్రంలోని బలమైన వర్గం ఎస్సీలకు చెందినవారు. రానున్న లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలించే అవకాశం లేకపోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా అభివృద్ధి చేశా
ఓటు వేసి గెలిపించిన ఓటరు తలదించుకునేలా తాను ఏ రోజూ వ్యవహరించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని కోరారు. -
పదేళ్లలో రాష్ట్రానికి భారాస, భాజపా చేసింది శూన్యం
గత పదేళ్లలో రాష్ట్రంలోని భారాస, కేంద్రంలోని భాజపా ప్రభుత్వాలు తెలంగాణకు చేసింది శూన్యమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
తేనీటి వెనక కన్నీటి ధారలు!
మన దేశంలో వేడివేడి ఛాయ్ మజాను ఆస్వాదించనివారు అరుదు. చాలా ఇళ్లలో చుట్టాలకు తొలి పలకరింపు తేనీటితోనే! పని ఒత్తిడి నుంచి కాస్త విరామం తీసుకునేటప్పుడు.. స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడేటప్పుడు.. చాలామందికి టీ కప్పు చేతిలో ఉండాల్సిందే!! -
12 మందికి నేరచరిత్ర
రాజస్థాన్లో లోక్సభకు పోటీ చేస్తున్న 12 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి. వారిలో కొందరిపై హత్య కేసులూ ఉన్నాయి. -
నవనీత్ రాణా.. ఓ నృత్యకారిణి
మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ స్థానం నుంచి పోటీచేస్తున్న భాజపా అభ్యర్థి, సినీనటి నవనీత్ రాణాపై శివసేన(యూబీటీ) నేత సంజయ్రౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరతీశాయి. -
సంక్షిప్త వార్తలు
ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది. మోదీ వచ్చాకే ఈ ప్రాంతం మిగిలిన దేశంతో మమేకమైంది. -
భాజపా వైపు ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
ఇది వారణాసి, వయనాడ్ మధ్య పోరాటం
తెలంగాణ నుంచి పోటీ చేయాలని రాహుల్గాంధీని తాము కోరినా వయనాడ్ వైపే మొగ్గు చూపారని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. కేరళ రాష్ట్రం వయనాడ్లో కాంగ్రెస్ పార్టీ గురువారం నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. -
రాహుల్ను ప్రధానిని చేయాలి: తుమ్మల
పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 15 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని... రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలను కోరారు. -
మాదిగలకు కాంగ్రెస్ రెండు పార్లమెంట్ సీట్లు కేటాయించాలి
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మాదిగలకు రెండు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాద్లో అమీర్పేట లీలానగర్లోని తన నివాసంలో గురువారం నిరసన దీక్ష చేపట్టారు. -
భాజపాను అడ్డుకుంటేనే రేవంత్కు, లౌకికవాదానికి మంచిది
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలవాలని.. కేరళకు వెళ్లి ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న వామపక్షాలపై ఆయన నోరు పారేసుకోవడం సరైంది కాదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. -
రేవంత్రెడ్డికి ఓట్లడిగే హక్కు లేదు: లక్ష్మణ్
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లోక్సభ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని రాజ్యసభ సభ్యుడు, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ విమర్శించారు. -
రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, వరి, మొక్కజొన్న పంటలకు రూ.500 బోనస్ ఇస్తామంటూ బోగస్ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. నాలుగు నెలల్లోనే కర్షకుల ఉసురు పోసుకుంటోందని, వారిని వేదనకు గురిచేస్తోందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. -
భాజపాతోనే వికసిత తెలంగాణ: గోవా సీఎం
గత పదేళ్లలో తెలంగాణను భారాస అధినేత కేసీఆర్ దోపిడీ చేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొల్లగొడుతోందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్సావంత్ ఆరోపించారు. -
ఈటల సేవలు దేశానికి అవసరం
కరోనా సమయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రజలకు సేవలందించిన ఈటల రాజేందర్ను లోక్సభ ఎన్నికల్లో గెలిపించి దేశవ్యాప్తంగా ఆయన సేవలు విస్తరిద్దామని కేంద్ర పట్టణాభివృద్ధి, పెట్రోలియం శాఖల మంత్రి హర్దీప్సింగ్ పురి అన్నారు. -
రత్నగిరి-సింధుదుర్గ్ భాజపా అభ్యర్థిగా నారాయణ్ రాణె
కేంద్రమంత్రి నారాయణ్ రాణెను మహారాష్ట్రలోని రత్నగిరి-సింధుదుర్గ్ లోక్సభ స్థానం నుంచి బరిలో దింపాలని భాజపా నిర్ణయించింది. -
భారాస నాయకులను చేర్చుకోవద్దు
భారాస నాయకులను కాంగ్రెస్లో చేర్చుకోవద్దంటూ వనపర్తి జిల్లా గోపాల్పేట మండల పార్టీ అధ్యక్షుడు గణేశ్గౌడ్, నాయకుడు శేఖర్ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎదుటే పెట్రోలు పోసుకుని నిరసనకు దిగారు. -
అమ్మ మరణాన్ని తట్టుకోలేకపోతున్నా
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హిమాచల్ప్రదేశ్ డిప్యూటీ సీఎం ముకేశ్ అగ్నిహోత్రి కుమార్తె ఆస్తా అగ్నిహోత్రి విముఖత వ్యక్తం చేశారు. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
కృష్ణుడి గోపికను నేనే హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు