Bihar Politics: ‘కొంతమంది నేతల అత్యాశే.. నా తండ్రి ఉద్యమాన్ని బలహీనపరిచింది’
బిహార్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) జాతీయ అధ్యక్షుడు పశుపతి కుమార్ పారస్పై పార్టీ నేత, వరుసకు కుమారుడైన చిరాగ్ పాసవాన్ ఆదివారం పరోక్షంగా విరుచుకుపడ్డారు. ‘అధికారం కోసం కొంతమంది పార్టీ నేతల అత్యాశ.. సమాజంలో...
పాట్నా: బిహార్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) జాతీయ అధ్యక్షుడు పశుపతి కుమార్ పారస్పై పార్టీ నేత, వరుసకు కుమారుడైన చిరాగ్ పాసవాన్ ఆదివారం పరోక్షంగా విరుచుకుపడ్డారు. ‘అధికారం కోసం కొంతమంది పార్టీ నేతల అత్యాశ.. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన తండ్రి రాంవిలాస్ పాసవాన్ ప్రారంభించిన ఉద్యమాన్ని బలహీనపరిచింద’ని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది జూన్లో పార్టీ రెండుగా చీలిపోవడంతో ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ వివాదం నేపథ్యంలో శనివారం కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) పార్టీ పేరు, ఎన్నికల గుర్తును స్తంభింపజేస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
రెండు స్థానాలకు ఉప ఎన్నికల వేళ..
ఈ వ్యవహారంపై చిరాగ్ స్పందిస్తూ.. ‘సమాజంలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించేందుకు రాంవిలాస్ పాసవాన్ దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమానికి పార్టీ స్వరంగా నిలిచింది. కానీ, కొంతమంది పార్టీ నేతలు అధికార అత్యాశలో చిక్కుకోవడంతో ఉద్యమం బలహీనపడింది’ అని ట్వీట్ చేశారు. ‘ఇది ఎన్నికల కమిషన్ మధ్యంతర నిర్ణయం. అధికారులు మా వాదనలను పరిగణనలోకి తీసుకున్నారు’ అని పేర్కొన్నారు. ఈ నెల 30న బిహార్లో కుషేశ్వర్ ఆస్థాన్, తారాపూర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న తరుణంలో ఎన్నికల సంఘం నిర్ణయం వెలువడటం గమనార్హం. ఒకవేళ ఈ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులను పోటీలో పెట్టాలనుకుంటే అందుబాటులో ఉన్న గుర్తులను వాడుకోవచ్చని ఈసీఐ తెలిపింది. ఇందుకు సంబంధించి ఇరు వర్గాలూ వేర్వేరుగా పార్టీల పేర్లు, ఎన్నికల గుర్తులను సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట కల్లా తెలియపరచాలని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్