Somu Veerraju: ఆ విషయం పవన్నే అడగాలి: సోము వీర్రాజు
పొత్తుల విషయంలో తాము స్పష్టంగా ఉన్నామని భాజపా ఏపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తెదేపా, జనసేన కలుస్తాయా?
ఏలూరు: పొత్తుల విషయంలో తాము స్పష్టంగా ఉన్నామని.. జనసేనతో పొత్తు కొనసాగుతోందని భాజపా ఏపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తెదేపా, జనసేన కలుస్తాయా? లేదా? అనేది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్నే అడగాలని చెప్పారు. ఏలూరులో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. పొత్తులపై నంద్యాల జిల్లాలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆ విషయాన్ని ఆయన్నే అడగాలని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. కుటుంబ పార్టీలతో భాజపా పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు.
మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లాలో బీ ఫార్మసీ విద్యార్థిని మృతి అంశంపై డీజీపీని కలుస్తామని సోము వీర్రాజు చెప్పారు. విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్న విధంగా ఈ కేసులో నిందితులందరిపైనా కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా