పవన్‌ కల్యాణ్‌ను కలిసిన సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్‌ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు శుక్రవారం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సోము వీర్రాజుకు ఈసందర్భంగా పవన్‌ శాలువా..

Updated : 07 Aug 2020 16:47 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు శుక్రవారం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. భాజపా అధ్యక్షుడిగా నియమితులైనందుకు సోము వీర్రాజుకు పవన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా శాలువా కప్పి సోము వీర్రాజును సత్కరించారు. ఏపీలో రెండు పార్టీలు కలిసి పనిచేయడంపై ఇరువురు నేతలు సమాలోచనలు జరిపారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఏపీలో భాజపా, జనసేన కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని