Sonia: విపక్ష నేతలతో సోనియా భేటీ.. దీదీ పార్టీకి అందని ఆహ్వానం!
పలు విపక్ష పార్టీలకు చెందిన నేతలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమావేశమయ్యారు. ఎన్సీపీ, డీఎంకే, శివసేన, సీపీఎం నేతలతో తన నివాసంలో భేటీ......
దిల్లీ: పలు విపక్ష పార్టీలకు చెందిన నేతలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమావేశమయ్యారు. ఎన్సీపీ, డీఎంకే, శివసేన, సీపీఎం నేతలతో తన నివాసంలో భేటీ అయిన సోనియా.. 12 మంది రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేసిన వ్యవహారంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్టు సమాచారం. ఈ భేటీలో ఎన్సీపీ అధినేత శరద్పవార్తో పాటు శివసేన నేత సంజయ్ రౌత్, డీఎంకే నేత టీఆర్ బాలు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తదితరులు హాజరైనట్టు తెలుస్తోంది. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుతో శరద్ పవార్ మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేలా చూడాలని ఈ భేటీలో నేతలు నిర్ణయించినట్టు సమాచారం. మరోవైపు, కాంగ్రెస్తో విభేదిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ను ఈ భేటీకి ఆహ్వానించలేదని తెలుస్తోంది.
గత వర్షాకాల సమావేశాల్లో సభలో అనుచితంగా, హింసాత్మక ధోరణితో ప్రవర్తించిన పలు పార్టీలకు చెందిన 12 మంది ఎంపీలను ఇటీవల పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యసభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అప్పట్నుంచి విపక్ష పార్టీలు నిరసన వ్యక్తంచేస్తూ పార్లమెంట్ ఉభయసభల కార్యకలాపాల్ని స్తంభింపజేస్తున్నాయి. దీంతో అటు లోక్సభ, ఇటు రాజ్యసభ వాయిదాల పర్వమే నడుస్తోంది. అయితే, ఆ ఎంపీలు తమ ప్రవర్తనకు క్షమాపణలు చెప్పేదాకా వెనక్కి తగ్గేదిలేదని కేంద్రం ఇప్పటికే తేల్చిచెప్పింది. రాజ్యసభ నుంచి సస్పెండ్ 12మంది ఎంపీల్లో కాంగ్రెస్ నుంచి ఆరుగురు ఉండగా.. శివసేన, తృణమూల్ కాంగ్రెస్ నుంచి చెరో ఇద్దరు, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
► Read latest Political News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఏకైక డిమాండ్తో యుగతులసి పార్టీ జాతీయ అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్ లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. -
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం