Sonia Gandhi: 5 రాష్ట్రాల పీసీసీ చీఫ్లకు సోనియా ఉద్వాసన!
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమిని చవిచూసిన కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన మొదలైంది. .....
దిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి చవిచూసిన కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన మొదలైంది. ఎన్నికల్లో పనితీరుపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ అయింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్లకు ఉద్వాసన పలికారు! వీరిలో పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్జ్యోత్సింగ్ సిద్ధూ కూడా ఉన్నారు. పీసీసీలను పునర్వ్యవస్థీకరించేందుకు వీలుగా ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ పీసీసీ అధ్యక్షులు రాజీనామాలు చేయాలని సోనియా గాంధీ కోరినట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్దీప్ సూర్జేవాలా ట్విటర్లో వెల్లడించారు.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్లో అధికారాన్ని కోల్పోవడంతో పాటు ఉత్తర్ప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్లలో ఎలాంటి ప్రభావం చూపలేక పూర్తిగా చతికిలపడిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఇంకొంత కాలం సోనియా గాంధీయే కొనసాగాలని నిర్ణయించింది. అలాగే, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపోటమిలకు కారణాలను సమీక్షించడంతో పాటు పార్టీని బలోపేతం చేసే అధికారాన్ని ఆమెకే అప్పగిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు