Samajwadi Party : సమాజ్వాది పార్టీ పునర్వ్యవస్థీకరణ
ఇటీవల లోక్సభ ఉప ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని సమాజ్వాదీ పార్టీలో పునర్వ్యవస్థీకరణ మొదలైంది. పార్టీకి పెట్టని కోటలు వంటి రామ్పూర్ ఆజమ్ఘడ్లలో కూడా ఓటిమి పాలైన విషయం తెలిసిందే. ఎస్పీ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్ మినహాయించి
ఇంటర్నెట్డెస్క్: ఇటీవల లోక్సభ ఉప ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని సమాజ్వాదీ పార్టీ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. పార్టీకి పెట్టని కోటలు వంటి రామ్పూర్, ఆజమ్ఘడ్లలో కూడా ఓటిమి పాలైన విషయం తెలిసిందే. ఎస్పీ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్ మినహాయించి మిగిలిన పదవులన్నిటినీ రద్దుచేస్తున్నట్లు పార్టీచీఫ్ అఖిలేష్ యాదవ్ ఆదివారం ప్రకటించారు. దీంతో పార్టీ జిల్లా విభాగాలు, అనుబంధ సంస్థల ఎగ్జిక్యూటీవ్ బాడీలు మొత్తం రద్దయ్యాయి. వీటిల్లో యువ, మహిళా విభాగాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని పార్టీ ట్విటర్ హ్యాండిల్లో వెల్లడించారు. ‘‘పార్టీ 2024 లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో పార్టీ వ్యవస్థీకృతంగా బలపడి భాజపాను పూర్తి శక్తిసామర్థ్యాలతో ఢీకొనడంపై దృష్టిపెట్టింది’’ అని సీనియర్ నాయకుడు ఒకరు తెలియజేశారు.
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) కంచుకోటలుగా పేరున్న రాంపుర్, ఆజంగఢ్ పార్లమెంటు సీట్లను ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో తన ఖాతాలో వేసుకొంది. రాంపుర్ లోక్సభ స్థానంలో అధికార భాజపా అభ్యర్థి ఘనశ్యామ్ లోధీ.. ఎస్పీకి చెందిన మొహమ్మద్ ఆసిమ్ రజాపై విజయం సాధించారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఖాళీ చేసిన ఆజంగఢ్ స్థానంలోనూ కమలదళాన్నే విజయం వరించింది. అక్కడ ధర్మేంద్ర యాదవ్ (ఎస్పీ)పై దినేశ్లాల్ యాదవ్ నిరాహువా (భాజపా) గెలుపొందారు. యూపీలో మొత్తం 80 లోక్సభ స్థానాలుండగా.. తాజా ఫలితాలతో అందులో భాజపా వాటా 64కు పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దేశంలో సురక్షితమైన సీటు లేదని, భవిష్యత్తులో ఆయన మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
కేరళలోని వయనాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, భాజపాపై విమర్శలు గుప్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!