UP Elections: నేరస్థులకు టికెట్లిచ్చి.. నిజస్వరూపం బయటపెట్టింది: యూపీ సీఎం
ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపా, సమాజ్వాదీపార్టీ మధ్య విమర్శలు.. ప్రతివిమర్శలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ నేరస్థులకు టికెట్లు ఇస్తోందని రాష్ట్ర సీఎం, భాజపా నేత యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. తాజాగా ఎస్పీ పార్టీ అభ్యర్థి, కైరానా నియోజక
ఎస్పీపై యోగి ఆదిత్యనాథ్ విమర్శలు
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాజపా, సమాజ్వాదీపార్టీ మధ్య విమర్శలు.. ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో నేరస్థులకు సమాజ్వాదీ పార్టీ టికెట్లు ఇస్తోందని రాష్ట్ర సీఎం, భాజపా నేత యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. తాజాగా ఎస్పీ పార్టీ అభ్యర్థి, కైరానా నియోజక వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే నహిద్ హసన్ నామినేషన్ దాఖలుకు వెళ్తుండగా.. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. గతేడాది గ్యాంగ్స్టర్ యాక్ట్ కింద నమోదైన కేసులో నిందితుడిగా ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘నేరస్థులకు పార్టీ టికెట్లు ఇవ్వడం ద్వారా సమాజ్వాది పార్టీ తన నిజ స్వరూపాన్ని మరోసారి బయటపెట్టింది. తిరిగి భాజపా అధికారంలోకి వస్తే ఈ నేరస్థులపై న్యాయవిచారణ జరిపి వారి భరతం పడతాం’’అని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. కాగా.. హసన్ అరెస్టుపై స్పందించిన ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్.. అది ఒక విఫలయత్నమన్నారు. అధికార పార్టీ.. తమ పార్టీ నేతలను, అభ్యర్థులను లక్ష్యంగా చేసుకొని ఈ విధంగా దాడులు చేస్తోందని అఖిలేశ్ ఆరోపించారు. యూపీలోని 403 నియోజవర్గాలకు ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చిన 10న ఫలితాలు వెల్లడవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?