Akhilesh Yadav: ప్రజల ఆగ్రహం చూస్తుంటే 400 సీట్లు ‘సైకిల్’వే!
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా యూపీలోని సమాజ్వాదీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా గురువారం ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ .....
లఖ్నవూ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా యూపీలోని సమాజ్వాదీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా గురువారం ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సైకిల్ యాత్ర నిర్వహించారు. సోషలిస్టు నేత దివంగత నేత జ్ఞానేశ్వర్ మిశ్రా జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ ర్యాలీలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతు చట్టాలు, నేరాల రేటు పెరుగుదల తదితర అంశాలను లేవనెత్తారు. లఖ్నవూలోని పార్టీ కార్యాలయం నుంచి సైకిల్ (ఎస్పీ ఎన్నికల గుర్తు) యాత్ర ప్రారంభించడానికి ముందు అఖిలేశ్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 400 స్థానాలు గెలుచుకుంటుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. ‘‘ వచ్చే ఎన్నికల్లో 350 స్థానాలు గెలుస్తామని గతంలో చెప్పా.. కానీ భాజపా పాలనపై ప్రజల ఆగ్రహం చూస్తుంటే 400 సీట్లలో విజయం ఖాయమని చెప్పగలను’ అని వ్యాఖ్యానించారు. ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 403 స్థానాలు ఉండగా.. 2017లో జరిగిన ఎన్నికల్లో ఎస్పీకి 47 సీట్లు రాగా.. భాజపా, మిత్రపక్షాలు కలిపి 325 స్థానాల్లో విజయదుందుభి మోగించిన విషయం తెలిసిందే.
కరోనా కట్టడిలోభాజపా ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడ్డారు. కొవిడ్ సెకండ్వేవ్లో మృతిచెందిన వారికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ విపత్కర సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రభుత్వం సాయం చేయలేదని ఆక్షేపించారు. ప్రజలకు ఆక్సిజన్, ఔషధాలు కూడా అందుబాటులో ఉంచకుండా వారి చావుకు వారిని వదిలేసిందని ధ్వజమెత్తారు. భాజపా 2017 ఎన్నికల మేనిఫెస్టోను చదవకుండా మనీ ఫెస్టోపై దృష్టి కేంద్రీకరించిందన్నారు. భాజపాలో వర్క్ కల్చర్లేదన్న అఖిలేశ్.. తమ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు పేర్లు మార్చడం తప్ప భాజపా ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో చేసిందేమీ లేదన్నారు. పిల్లల్లో పోషకాహార లోపం, కస్డడీ మరణాలు, గంగా నదిలో మృతదేహాలను పారవేసే వ్యవహారంలో రాష్ట్రాన్ని భాజపా ప్రభుత్వం తొలి స్థానంలో నిలిపిందని ఆక్షేపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM