‘గుజరాత్లో నూతన రాజకీయానికి నాంది’
గుజరాత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ తనదైన శైలిలో రాణించడంపై ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడితో గుజరాత్ రాజకీయాల్లో నూతన ఒరవడి ప్రారంభమైందని పేర్కొన్నారు.
దిల్లీ: గుజరాత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడంపై ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడితో గుజరాత్ రాజకీయాల్లో నూతన ఒరవడి ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన సూరత్లో తమ పార్టీని విశేషంగా ఆదరించిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు కేజ్రీవాల్ బుధవారం ఓ సమావేశంలో వెల్లడించారు.
‘గుజరాత్ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ సాధించిన విజయం రాష్ట్ర రాజకీయాల్లో నూతన ఒరవడికి నాంది. మేం గెలిచిన చోట నిజాయతీతో కూడిన రాజకీయాలు అందిస్తాం. మంచి విద్యాలయాలు, ఆస్పత్రులు, విద్యుత్ సౌకర్యాలు అందించే దిశగా రాజకీయాలు మొదలవుతాయి. గుజరాత్ అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తాం’ అని కేజ్రీవాల్ తెలిపారు. అంతేకాకుండా ఎన్నికల్లో గెలిచిన తమ అభ్యర్థులు ఎలాంటి పక్షపాతం లేకుండా తమ బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు. కాగా అరవింద్ కేజ్రీవాల్ ఫిబ్రవరి 26న సూరత్ పర్యటనకు వెళ్లనున్నారు.
గుజరాత్లో ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు ఆదివారం ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అన్ని కార్పొరేషన్లను అధికార భాజపా క్లీన్స్వీప్ చేసింది. కానీ అనూహ్యంగా సూరత్ కార్పొరేషన్లో ఆప్ 27 స్థానాల్లో విజయం సాధించి.. ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్