సువేందు అధికారి కాన్వాయ్పై రాళ్లదాడి
పశ్చిమ్ బెంగాల్లోని సొంత నియోజకవర్గం నందిగ్రామ్లో పోలింగ్ జరుగుతోన్న వేళ.. భాజపా నేత సువేందు అధికారి కాన్వాయ్పై గురువారం రాళ్లదాడి జరిగింది.
సురక్షితంగా బయటపడిన భాజపా నేత
కోల్కతా: పశ్చిమ్ బెంగాల్లోని సొంత నియోజకవర్గం నందిగ్రామ్లో పోలింగ్ జరుగుతోన్న వేళ.. భాజపా నేత సువేందు అధికారి కాన్వాయ్పై గురువారం రాళ్లదాడి జరిగింది. అయితే, ఆ దాడి నుంచి సువేందు సురక్షితంగా బయటపడ్డారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు.. నందిగ్రామ్లోని సాతేన్గాబరీ ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. రాళ్ల దాడిలో సువేందు కారు వెనక వస్తోన్న మీడియా వాహనం మాత్రం స్వల్పంగా ధ్వంసమైందని వెల్లడవుతోంది.
అలాగే, పశ్చిమ మిడ్నాపూర్లోని కేశ్పూర్ భాజపా అభ్యర్థి ప్రీతి రంజన్ కాన్వాయ్పై కూడా దాడి జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం రెండో దశలో భాగంగా బెంగాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. సువేందు, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్న నందిగ్రామ్ కూడా ఆ స్థానాల్లో ఒకటి. ఇదిలా ఉండగా మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 58 శాతం పోలింగ్ నమోదైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
భాజపా కార్యకర్త మృతి:
నందిగ్రామ్లో ఓ భాజపా కార్యకర్త గురువారం ఉదయం తన ఇంట్లో ఉరి వేసుకొని మరణించినట్లు పోలీసులు గుర్తించారు. దాంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతుడి పేరు ఉదయ్ దుబేగా పోలీసులు చెప్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్