Politics news: ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కానున్నాయ్: నీతీశ్కుమార్
రానున్న లోక్సభ ఎన్నికల్లో అధికార భాజపాను గద్దె దించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి అడుగులేస్తాయని జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ అన్నారు. ఈ మేరకు వివిధ పార్టీలతో సంప్రదింపులు జరుగుతున్నాయని, త్వరలోనే విపక్షాలు...
దిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికల్లో అధికార భాజపాను గద్దె దించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి అడుగులేస్తాయని జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ అన్నారు. ఈ మేరకు వివిధ పార్టీలతో సంప్రదింపులు జరుగుతున్నాయని, త్వరలోనే విపక్షాలు కూటమిగా కలిసి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార భాజపాపై విమర్శలు గుప్పించారు. వాళ్లకు అంతర్గతంగా పలు సమస్యలున్నాయని, అవి పరిష్కరించుకోకుండా రాత్రి పగలు మాట్లడటమే వాళ్లకు తెలుసని వ్యాఖ్యానించారు.
‘‘ దేశంలోని పలు పార్టీలు క్రమంగా చేతులు కలుపుతారు. క్రమంగా ఈ కూటమి బలమైన శక్తిగా అవతరించేందుకు అవకాశం ఉంది. పలు పార్టీలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. 2024 ఎన్నికల్లో ఈ కూటమి కలసికట్టుగా పోరాడుతుంది ’’అని నితీశ్ పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాయి కదా.. భవిష్యత్లో ఏర్పాటయ్యే కూటమిలో ఈ రెండు పార్టీలు కూడా భాస్వాములవుతాయా? అని విలేకరులు ప్రశ్నించగా.. ప్రతిపక్షాలన్నీ కూటమిగా ఏర్పడిన తర్వాతే ఏదైనా నిర్దిష్టంగా చెప్పగలం అని నీతీశ్ అన్నారు.
కూటమి ఏర్పాటుపై చర్చలు జరిపేందుకు జేడీయూ అధినేత నీతీశ్కుమార్ ఇప్పటికే పలువురు నేతలతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్తో ఆయన భేటీ అయ్యారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్తో కలిసి ఆదివారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కూడా సమావేశమయ్యారు. ఈ భేటీలోనూ కూటమి ఏర్పాటుపైనే చర్చంచినట్లు సమాచారం. ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో సహా పలువురు పార్టీల నేతలతో ఆయన భేటీ అయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దేశంలో సురక్షితమైన సీటు లేదని, భవిష్యత్తులో ఆయన మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
కేరళలోని వయనాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, భాజపాపై విమర్శలు గుప్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!