‘లోకేశ్.. ప్రొద్దుటూరు నుంచి పోటీ చేస్తారా?’
నందం సుబ్బయ్యను హత్యచేయించారన్న ఆరోపణలను కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్రెడ్డి ఖండించారు. హత్యారోపణలు చేస్తున్న నారా లోకేశ్ ప్రొద్దుటూరు నుంచి పోటీ చేస్తానంటే....
ఎమ్మెల్యే శివప్రసాద్రెడ్డి సవాల్
ప్రొద్దుటూరు: తెదేపా నేత నందం సుబ్బయ్యను హత్య చేయించారన్న ఆరోపణలను కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి ఖండించారు. హత్యారోపణలు చేస్తున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రొద్దుటూరు నుంచి పోటీ చేస్తానంటే రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకొని ఊరొదిలి వెళ్లిపోతానన్నారు. ‘నేను నందం సుబ్బయ్యను హత్య చేయించానని.. హత్య చేసేందుకు ప్రోత్సహించానని నువ్వు నమ్మితే.. నీకో సవాల్ విసురుతున్నా. ఈ హత్య అంశంపై ప్రొద్దుటూరు ప్రజల అభిప్రాయం కోరదాం. నువ్వు ఇక్కడ పోటీ చేస్తానంటే నేను రాజీనామా చేస్తా. పోటీలో పాల్గొందాం. నందం సుబ్బయ్యను శివప్రసాద్రెడ్డి హత్య చేశాడని మీరు నమ్మితే నాకు ఓటేయండని నువ్వు ప్రజలను ఓటు అడుగు. హత్య చేయలేదని మీరు నమ్మితే నాకు ఓటు వేయండి అని నేను అడుగుతా. ఒకవేళ నేను ఓటమిపాలైతే ఆ మరుక్షణమే రాజకీయాల నుంచి నిష్ర్కమిస్తా. ఊరు వదిలి వెళ్లిపోతా’ అని లోకేశ్కు శివప్రసాద్రెడ్డి సవాల్ విసిరారు.
ఇవీ చదవండి...
చౌడేశ్వరి ఆలయంలో రాచమల్లు సవాల్
గాల్లోకి కాల్పులు జరిపిన వైకాపా నేత
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?