Politcs: 5 రాష్ట్రాల ఎన్నికల్లో 4 చోట్ల విజయం భాజపాదేనా?
వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో 4 చోట్ల భాజపా విజయం సాధించనుందని ఏబీపీ- సీఓటర్-ఐఏఎన్ఎస్ స్నాప్ పోల్ సర్వే అంచనావేసింది. ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో భాజపా అధికారం నిలబెట్టుకుంటుందని తెలిపింది. అయితే యూపీ, ఉత్తరాఖండ్లో...
ఇంటర్నెట్డెస్క్: వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో 4 చోట్ల భాజపా విజయం సాధించనుందని ఏబీపీ- సీఓటర్-ఐఏఎన్ఎస్ స్నాప్ పోల్ సర్వే అంచనావేసింది. ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో భాజపా అధికారం నిలబెట్టుకుంటుందని తెలిపింది. అయితే యూపీ, ఉత్తరాఖండ్లో గతం కంటే తక్కువ స్థానాలు గెలవనున్నట్లు సర్వే పేర్కొంది. పంజాబ్లో ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్లు తెలిపింది. పంజాబ్ తప్ప మిగతా 4 రాష్ట్రాల్లో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తమైనట్లు సర్వే వెల్లడించింది.
ఉత్తర్ప్రదేశ్లో 217 స్థానాలు:
ఉత్తర్ప్రదేశ్లో వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల్లో అధికార భారతీయ జనతాపార్టీ మరోసారి జయకేతనం ఎగరేస్తుందని ఏబీపీ సర్వే వెల్లడించింది. 403 శాసనసభ స్థానాలున్న యూపీలో కమళదళం మిత్రులతో కలిసి 217 సీట్లు కైవసం చేసుకుంటుందని తెలిపింది. 2017లో 325 సీట్లు సాధించిన భాజపా.. ఈసారి 108 స్థానాలు కోల్పోనుందని పేర్కొంది. ఈ స్థానాలను సమాజ్వాదీ పార్టీ దక్కించుకోనుందని సర్వే వెల్లడించింది. యూపీలో భాజపా-ఎస్పీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని, సమాజ్వాదీ పార్టీ 156 సీట్లు దక్కించుకునే అవకాశముందని సర్వే తెలిపింది. అయితే భాజపా ఓట్ల శాతంలో పెద్ద తేడా ఉండబోదని, 40.7శాతం ఓట్లు సాధిస్తుందని పేర్కొంది. ఇది గత ఎన్నికల కంటే 0.7శాతం తక్కువ. ఎస్పీ 7.1శాతం అధికంగా, 31.1 శాతం ఓట్లు సాధిస్తుందని సర్వే తేల్చింది.
ఉత్తరాఖండ్లో పుంజుకోనున్న కాంగ్రెస్
యూపీతోపాటు ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్లోనూ సర్వే నిర్వహించారు. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ పుంజుకుంటుందని సర్వేలో తేలింది. పంజాబ్లో ఆమ్ఆద్మీ అతిపెద్ద పార్టీగా అవతరించనుందని సర్వే అంచనా వేసింది. 70 శాసనసభ స్థానాలున్న ఉత్తరాఖండ్లో 38 సీట్లతో భాజపా మెజార్టీ మార్కును దాటుతుందని సర్వే పేర్కొంది. గతంలో ఆ పార్టీ సాధించిన 57 సీట్లతో పోలిస్తే 19 స్థానాలు తక్కువని అంచనా వేసింది. హస్తం పార్టీ 21 సీట్లు ఎక్కువ సాధించి, తన బలాన్ని 32కి పెంచుకుంటుందని సర్వే పేర్కొంది. 117 స్థానాలున్న పంజాబ్ శాసనసభలో 51 సీట్లతో ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించనుందని తెలిపింది. అధికార కాంగ్రెస్ 46 సీట్లకు పరిమితం కానున్నట్లు అంచనా వేసింది. గత ఎన్నికల్లో 77 సీట్లు సాధించిన హస్తం పార్టీ.. ఈసారి 31 నియోజకవర్గాలు కోల్పోనుందని తెలిపింది. అయితే కొత్త సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ పాలన కాంగ్రెస్కు కలిసొచ్చే అవకాశముంది. 20 సీట్లతో అకాళీదళ్ మూడో స్థానంలో నిలవనుందని సర్వే పేర్కొంది.
గోవాలో 21 సీట్లు!
40 శాసనసభ స్థానాలున్న గోవాలో అధికార భాజపా 21 స్థానాలతో తిరిగి అధికారం నిలబెట్టుకునే అవకాశముందని సర్వే అంచనా వేసింది. ఆప్ 5, కాంగ్రెస్ 4 స్థానాలు సాధిస్తాయని లెక్కకట్టింది. ఇతరులు 10 చోట్లు గెలుపొందుతారని పేర్కొంది. మణిపూర్లోనూ కమలం పార్టీదే ఆధిక్యమని సర్వే తేల్చింది. 60 శాసనసభ స్థానాల్లో భాజపా 27, కాంగ్రెస్ 22 సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేసింది.
మోదీ పని తీరు సంతృప్తికరం
ప్రధాని మోదీ పనితీరుపై ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించగా.. 41.4 శాతం మంది చాలా సంతృప్తికరంగా ఉన్నట్లు తేలింది. 26.9శాతం మంది కొంత వరకు సంతృప్తికరమని, 29.1 శాతం మంది అసలు సంతృప్తిగా లేమన్నారని సర్వే తేల్చింది. 2.6శాతం మంది ఏమీ చెప్పలేమని బదులిచ్చారు. కేంద్రం పని తీరుపై 36.3శాతం మంది ఎక్కువ సంతృప్తి వ్యక్తం చేయగా.. 28.4శాతం మంది కొంతవరకు సంతృప్తి చెందినట్లు తెలిపారు. 31.8శాతం మంది అసలు సంతృప్తికరంగా లేమన్నారు. 3.5 శాతం మంది ఏమీ చెప్పలేమన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ పని తీరుపై పంజాబ్లో ఎక్కువగా వ్యతిరేకత కనిపించినట్లు సర్వే తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. సీపీఎం మద్దతు కోరింది. -
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
ఒక్క డీఎస్సీ కూడా పెట్టకుండా జగన్.. యువత భవిష్యత్తు నాశనం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. -
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, రాహుల్గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు సీపీఐ(ఎం), కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. -
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. -
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
First phase of LS polls: లోక్సభ ఎన్నికల తొలి విడతలో.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. -
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు. -
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. -
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!