Telangana News: భాజపాలో ధనవంతులకే ప్రాధాన్యం.. అందుకే రాజీనామా చేస్తున్నా: స్వామిగౌడ్‌

శాసనమండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ భాజపాకు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపారు.

Updated : 21 Oct 2022 16:42 IST

హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికకు ముందు భాజపాకు మరో షాక్‌ తగిలింది. ఇవాళ దాసోజు శ్రవణ్‌ రాజీనామా చేయగా,  ఆ తర్వాత కొన్ని గంటలకే  శాసనమండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ భాజపాకు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో భాజపా విఫలమైందని ఆరోపించారు. భాజపాలో ధనవంతులు, కాంట్రాక్టర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని స్వామిగౌడ్‌ ఆరోపించారు. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఆయన తెరాసలో చేరనున్నట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని