Punjab election Result: సీఎంను ఓడించిన స్వీపర్ కుమారుడు..!
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 92 స్థానాలను కొల్లగొట్టింది. ‘చీపురు’ తుపానుకు కాంగ్రెస్ పార్టీలోని దిగ్గజ నేతలందరూ కొట్టుకుపోయారు
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 92 స్థానాలను కొల్లగొట్టింది. ‘చీపురు’ తుపానుకు కాంగ్రెస్ పార్టీలోని దిగ్గజ నేతలందరూ కొట్టుకుపోయారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు సహా అనేక మంది హేమాహేమీలకు ఓటమి తప్పలేదు. సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీని రెండు చోట్లా విజయం వరించలేదు. రెండు స్థానాల్లోనూ ఆప్ అభ్యర్థుల చేతుల్లోనే ఆయన ఓటమిపాలయ్యారు. చన్నీని ఓడించిన వారిలో ఒకరు స్వీపర్ కుమారుడు కావడం గమనార్హం.
‘సామాన్యుడి’ చేతిలో..
ఈ ఎన్నికల్లో చన్నీ తన సొంత నియోజకవర్గమైన చామ్కౌర్ సాహిబ్తో పాటు బదౌర్ నుంచి కూడా పోటీ చేశారు. బదౌర్ స్థానంలో ఆప్ అభ్యర్థి లబ్సింగ్ ఉగోక్ చేతిలో 37,558 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 35 ఏళ్ల ఉగోక్.. అత్యంత సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఎన్నికల ముందు వరకు ఆయన ఓ మొబైల్ రిపేర్ షాప్ను నిర్వహించేవారు. ఆయన తండ్రి డ్రైవర్ కాగా.. తల్లి ఓ ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్గా పనిచేస్తున్నారు. ఉగోక్ 12వ తరగతి వరకు చదువుకున్నారు. నామినేషన్ పత్రాల ప్రకారం.. ఆయన ఆస్తులు రూ.4.1లక్షలు మాత్రమే. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో వాలంటీర్గా చేరారు. ఆ తర్వాత కార్యకర్తగా ఎదిగి నేడు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
చన్నీని ఓడించిన చరణ్జీత్..
ఇక తన సొంత నియోజకవర్గమైన చామ్కౌర్ సాహిబ్లోనూ చరణ్జీత్ సింగ్ చన్నీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ స్థానంలోనూ ఆమ్ ఆద్మీ అభ్యర్థి చేతిలో 7,492 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. మరో విషయమేంటంటే.. చన్నీని ఓడించిన అభ్యర్థి పేరు కూడా చరణ్జీత్ సింగే. ఆప్ అభ్యర్థి అయిన డాక్టర్ చరణ్జీత్ నేత్ర వైద్యులుగా పనిచేస్తున్నారు. అంధులకు చూపు అందించేందుకు ఆయన చేసిన సేవలతో మంచిపేరు తెచ్చుకున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన డా.చరణ్జీత్.. చన్నీ చేతిలో 12వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. తాజా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ఆయనకే టికెట్ ఇచ్చింది. గురువారం వెలువడిన ఫలితాల్లో సీఎంపై చరణ్జీత్ విజయం సాధించి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అమృత్సర్ తూర్పు నుంచి పోటీ చేసిన ఆయన ఆప్ అభ్యర్థి జీవన్జోత్ కౌర్ చేతిలో 6,591 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. జీవన్జోత్ కౌర్ ఓ సామాజిక కార్యకర్త. ప్యాడ్ వుమన్గా స్థానికంగా పేరొందారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పాటియాలాలో, రాజకీయ కురువృద్ధుడు ప్రకాశ్ సింగ్ బాదల్ లంబిలో ఆప్ అభ్యర్థుల చేతుల్లో ఓటమి పాలయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!