బెంగాల్‌ క్షేత్రంలో స్థానిక, స్థానికేతర పోరు

పశ్చిమ బెంగాల్‌లో భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌ మధ్య పోరు రసవత్తరంగా మారిన వేళ టీఎంసీ స్థానికత అస్త్రాన్ని బయటకు తీస్తోంది. భాజపా బయటి పార్టీ అని విమర్శలు గుప్పిస్తోంది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు కమలనాథులు భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు....

Published : 04 Apr 2021 02:23 IST

తెరపైకి జనసంఘ్‌ వ్యవస్థాపకుడి పేరు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమ బెంగాల్‌లో భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌ మధ్య పోరు రసవత్తరంగా మారిన వేళ టీఎంసీ స్థానికత అస్త్రాన్ని బయటకు తీస్తోంది. భాజపా బయటి పార్టీ అని విమర్శలు గుప్పిస్తోంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కమలనాథులు భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామప్రసాద్‌ ముఖర్జీ పేరును తెరపైకి తీసుకొచ్చి ఇక్కడివారమే అని పేర్కొంటున్నారు. అఖిల భారత హిందూ మహాసభకు అధ్యక్షుడిగా సేవలందించిన శ్యామప్రసాద్‌ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌ పార్టీనే నేడు భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందిందని అంటున్నారు. అలాంటప్పుడు తాము బయటివారము ఎలా అవుతామంటూ ప్రశ్నిస్తున్నారు.

ఆధునిక భారతం నుంచి హిందూ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేసిన వారందరూ బెంగాల్‌ నుంచే వచ్చారని భాజపా ఎంపీ స్వపన్‌దాస్‌ గుప్తా పేర్కొంటున్నారు. కాగా శ్యామప్రసాద్‌ ముఖర్జీ వారసత్వాన్ని భాజపా నేతలు పునికిపుచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆయన కుటుంబసభ్యులు తప్పుపట్టకపోయినప్పటికీ.. ముఖర్జీ కాలం నాటి పరిస్థితులను నేటి పరిస్థితులతో పోల్చి చూసి మాట్లాడుతున్నారు. ముఖర్జీని బెంగాల్‌ సర్కారు ఇన్నేళ్లుగా పట్టించుకోలేదని ఆక్షేపిస్తున్నారు. స్థానికులు-బయటివారు అన్న వాదన వినిపిస్తున్నప్పటి నుంచి ఒక్కసారిగా శ్యామప్రసాద్‌ వారసత్వాన్ని సొంతం చేసుకునేందుకు టీఎంసీ సహా ఆయా పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని