తమిళ పోరు.. కీలక స్థానాల్లో గెలుపెవరిది..?
తమిళనాడులో రాజకీయ దిగ్గజాలు జయలలిత, కరుణానిధి లేకుండా జరుగుతోన్న తొలి ఎన్నికల సంగ్రామం ఇదే కావడంతో అక్కడి రాజకీయాలపై మరింత ఆసక్తి నెలకొంది.
ఇంటర్నెట్డెస్క్: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్నవేళ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకే కూటములతో పాటు కొత్త పార్టీలు హోరాహోరీ ప్రచారంలో నిమగ్నమయ్యాయి. అటు అన్నాడీఎంకే మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తుండగా, డీఎంకే మాత్రం ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని శ్రమిస్తోంది. అయితే, తమిళనాడులో రాజకీయ దిగ్గజాలు జయలలిత, కరుణానిధి లేకుండా జరుగుతున్న తొలి ఎన్నికల సంగ్రామం ఇదే కావడంతో అక్కడి రాజకీయాలపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ సమయంలో తమిళనాడులో కీలకంగా ఉన్న పలు అసెంబ్లీ నియోజకవర్గాలు, కీలక నేతల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం..
కంచుకోట నుంచి పళనిస్వామి..
ఈ సారి ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామిపై అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. అన్నాడీఎంకేలో 1974లో ఓ వాలంటీర్గా అడుగుపెట్టిన పళనిస్వామి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. జయలలిత మరణం తర్వాత పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పటికీ, కొంతకాలానికే ఆయన రాజీనామాతో పళనిస్వామి సీఎం పీఠమెక్కారు. ఇప్పటికే నాలుగు సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందిన పళనిస్వామి, ఎడప్పాడి స్థానం నుంచి మరోసారి గెలుపొందాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి 37 ఏళ్ల సంపత్కుమార్ను డీఎంకే పోటీలో నిలబెట్టింది. స్థానిక వ్యక్తిగా ఉన్న తనకు ఇక్కడి సమస్యలపై పోరాటం చేస్తానని.. ముఖ్యమంత్రిపై గెలిపించాలని సంపత్ కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, అన్నాడీఎంకేకు కంచుకోటగా ఉన్న ఎడప్పాడి నియోజకవర్గంలో తాను మరోసారి గెలుస్తానని పళని స్వామి ధీమా వ్యక్తం చేస్తున్నారు.
బోడినాయక్కనూర్పైనే పన్నీర్సెల్వం..
ఓపీఎస్గా పేరొందిన తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మరో కీలక వ్యక్తి అనే చెప్పుకోవచ్చు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పన్నీర్ సెల్వం తాజాగా తేని జిల్లాలోని బోడినాయక్కనూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత రెండు పర్యాయాలుగా ఆయన బోడినాయక్కనూర్ నుంచే పోటీచేసి విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో అన్నాడీఎంకేకు మంచి పట్టున్నప్పటికీ డీఎంకే నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. గత ఎన్నికల్లో ప్రత్యర్థిపై 8శాతం ఓట్ల మెజారిటీతో పన్నీర్ విజయం సాధించారు. అయితే, అన్నాడీఎంకే నుంచి ఆండిపట్టి నియోజకవర్గం నుంచి రెండు సార్లు గెలుపొందిన తంగా తమిళ్సెల్వం ఈసారి డీఎంకేలో చేరిపోయారు. డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వం నియోజకవర్గమైన బోడినాయక్కనూర్ నుంచి తంగా తమిళ్సెల్వంను డీఎంకే బరిలో దింపింది. దీంతో ఈసారి అక్కడ ఇరు పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కొళత్తూర్లో స్టాలిన్ vs ఆది రాజారాం..
కరుణానిధి మరణం తర్వాత.. తమిళనాడులో డీఎంకే నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఎంకే స్టాలిన్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన కొళత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి రెండుసార్లు గెలిచిన స్టాలిన్, హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గత రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి కొళత్తూర్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని చెబుతోన్న స్టాలిన్.. ఈసారి కూడా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో (2016) అన్నాడీఎంకే ప్రత్యర్థిపై 37 వేల ఓట్ల మెజారిటీతో స్టాలిన్ విజయం సాధించారు. అంతకుముందు 2011 ఎన్నికల్లో మాత్రం కేవలం 2 వేల ఓట్ల మార్జిన్తో మాత్రమే స్టాలిన్ గెలుపొందారు. ప్రస్తుతం అన్నాడీఎంకే సీనియర్ నేత ఆది రాజారాం బరిలో ఉండడంతో అక్కడ పోటాపోటీ నెలకొంది. అయితే, తాము అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి నియోజకవర్గం అని పేరున్న కొళత్తూర్ను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని స్టాలిన్ అక్కడి ప్రజలకు హామీ ఇస్తున్నారు.
తాత కోట నుంచి ఉదయానిధి స్టాలిన్..
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనువడు, ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. ఒకప్పుడు తాత కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన చెపాక్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఉదయనిధి స్టాలిన్ మూడేళ్ల కిందటే రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటికీ.. ఇప్పటివరకు ఆయన డీఎంకే యూత్ వింగ్ సెక్రటరీగా ఉన్నారు. అయితే అరంగేట్రంలోనే కీలక చెపాక్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతుండడంతో ఈ నియోజకవర్గం మరోసారి ఆసక్తిగా మారింది. డీఎంకేకు కంచుకోటగా ఉన్న చెపాక్ స్థానం నుంచి కరుణానిధి మూడు సార్లు పోటీ చేసి విజయం సాధించారు. ఇందులో రెండుసార్లు ఆయన ముఖ్యమంత్రి కావడంతో ఈ స్థానాన్ని కరుణానిధి కుటుంబం అదృష్టంగా భావిస్తోంది. గత ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థిపై దాదాపు 14వేల ఓట్ల మెజారిటీతో డీఎంకే విజయం సాధించింది. ఈసారి కూడా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఉదయ నిధి స్టాలిన్ ధీమాతో ఉన్నారు.
కమల్హాసన్ vs శ్రీనివాసన్
ప్రముఖ నటుడు కమల్ హాసన్ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగడంతో తమిళనాడులో మరో కీలక నియోజక వర్గం కోయంబత్తూర్ దక్షిణపై అందరి దృష్టి మళ్లింది. కమల్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తుండగా అన్నాడీఎంకే కూటమి నుంచి వానతి శ్రీనివాసన్ (భాజపా) బరిలో ఉన్నారు. ఇక ఇదే స్థానంలో డీఎంకే కూటమి అభ్యర్థి మయూరా జయకుమార్ కూడా తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తొలుత కమల్ చెన్నైలోని మైలాపూర్ నుంచి పోటీచేయాలని భావించిన్నప్పటీకి చివరకు కోయంబత్తూర్వైపే మొగ్గుచూపారు. గత లోక్సభ ఎన్నికల్లో ఈ పార్టీ అభ్యర్థి దాదాపు లక్షన్నర ఓట్లతో మూడో స్థానంలో నిలవగా.. కోయంబత్తూర్ దక్షిణం నియోజకవర్గంలోనే 23 వేల ఓట్లు లభించాయి. దీంతో కమల్ ఈ స్థానాన్నే ఎంచుకొన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో ఏర్పడిన కోయంబత్తూర్ దక్షిణంలో ఇప్పటివరకు రెండు సార్లు ఎన్నికలు జరగ్గా.. రెండు ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే అభ్యర్థే విజయం సాధించారు. దీంతో ఈసారి కమల్ హాసన్కు అన్నాడీఎంకే మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది.
ఒంటరిగానే దినకరన్ పోరు..
అన్నాడీఎంకే బహిష్కృత నేత, శశికళ అల్లుడు టీటీవీ దినకరన్ అమ్మా మక్కల్ మున్నెట్ర కజగం (ఏఎంఎంకే) తరఫున ఎన్నికల బరిలోకి దిగారు. గతంలో జయలలిత ప్రాతినిధ్యం వహించిన చెన్నై ఆర్ఆర్ నగర్ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి మాత్రం సొంతపార్టీ ఏఎంఎంకే తరఫున తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే, ప్రస్తుతం దినకరన్ ఆర్ఆర్ నగర్ నుంచి కాకుండా అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రి (కె రాజు) అసెంబ్లీ స్థానం కోవిల్పట్టీ నుంచి పోటికి దిగారు. ఈ స్థానంలో డీఎంకే కూటమి నుంచి కె.శ్రీనివాసన్ పోటీ ఇవ్వనున్నారు. దీంతో ఇక్కడ త్రిముఖ పోటీ కనిపిస్తోంది. అయితే, రాజకీయాల నుంచి దూరంగా ఉంటానంటూ శశికళ ప్రకటించడంతో ఈ ఎన్నికల్లో గెలుపుకోసం టీటీవీ దినకరన్ ఒంటరిగానే శ్రమిస్తున్నారు. ఈ మధ్యే అన్నాడీఎంకే నేతల పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆ పార్టీ నేత బాబు మురుగయన్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దినకరన్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
కాంగ్రెస్ కంచుకోట కోలార్లో అసమ్మతి భగ్గుమంటోంది. ఈ స్థానానికి వారసత్వంగా సీటు కేటాయిస్తే రాజీనామాలు చేస్తామని పార్టీ సీనియర్ నేతల నుంచి ధిక్కారస్వరం వినిపిస్తోంది. -
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. -
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్పైనే ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
భూమా అఖిలప్రియను అడ్డుకున్న వైకాపా నేతలు.. యర్రగుంట్లలో ఉద్రిక్తత
మాజీ మంత్రి, ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియను వైకాపా నేతలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
వైకాపా ప్రభుత్వం పని అయిపోయిందని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని కోరారు. -
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారాసను ఓడించి శిక్ష విధించినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. -
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. -
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్!
Congress: కంగనా రనౌత్పై కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ తాజా లోక్సభ అభ్యర్థుల జాబితా నుంచి తప్పించింది. -
ఇంటికి కిలో బంగారం పంచినా జగన్కు ఓటమే
అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిన జనం.. జగన్ను తాడేపల్లి ప్యాలెస్లో శాశ్వతంగా బంధించేందుకు నిర్ణయించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
నగదు, మద్యం దొరికినా అధికారులు స్పందించరేం?
తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద వైకాపా నేతలకు చెందిన మద్యం, నగదు, ప్రచార సామగ్రి డంప్లు దొరికినా.. జిల్లా కలెక్టర్, ఆర్వోలు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
ప్రకాశం ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కుకు కేటాయించాలి: సీపీఎం
ప్రకాశం జిల్లా యర్రజర్లకొండ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల కింద కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. -
రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి
యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
ముందు చెల్లికి సమాధానం చెప్పాలి
బస్సు యాత్ర పేరిట ఇడుపులపాయకు వెళ్లిన జగన్... బాబాయిని గొడ్డలితో చంపించిన వ్యక్తిని వెంట బెట్టుకుని బయటకొచ్చారని, అయిదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న చెల్లి సునీత ఆవేదనను పట్టించుకోక పోవడమే కాకుండా సొంత చెల్లి షర్మిలకూ అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు. -
రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డికి అసమ్మతి సెగ
‘పరిటాల కుటుంబంతో పోరాటం అన్నది నా ఒక్కడితో సాధ్యం కాదు.. ఇప్పటికే ఒకసారి ఓడిపోయి ఇల్లు అమ్ముకొని రోడ్డున పడ్డానని ప్రకాశ్రెడ్డి అంటే ఆయనను ఇంట్లో కూర్చోబెట్టాం..మమ్మల్ని మాత్రం ఆయన రోడ్డున పడేశారు. -
మట్టి మింగేస్తున్నారు.. మనుషుల్ని చంపేస్తున్నారు
‘వైకాపా పాలనలో అక్రమ తవ్వకాలతో మట్టిని మింగేస్తున్నారు.. ప్రశ్నించిన మనుషులనూ చంపేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. -
పవన్కల్యాణ్తో నాయకుల సమావేశం
ఒంగోలు ఎంపీ, తెదేపా నేత మాగుంట శ్రీనివాసులురెడ్డి.. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్తో భేటీ అయ్యారు. -
తెలిసే.. వదిలేశారా?
అధికార వైకాపా తాయిలాల పంపిణీలో దూసుకుపోతుంటే తిరుపతి జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్టీల ఉమ్మడి భేటీలు
ఎన్నికల కార్యాచరణ, క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 4న లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో, 8న శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాల్ని నిర్వహించాలని తెదేపా, జనసేన, భాజపా నిర్ణయించాయి. -
కేసుల్లోనూ నంబర్ వన్ ముఖ్యమంత్రి జగనే
దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలోకెల్లా ధనవంతుడైన జగన్.. కేసుల్లోనూ ముందు వరుసలోనే ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నేత దీపక్రెడ్డి ఎద్దేవా చేశారు. -
అనంతపురం జిల్లాలో ఘోరం..
అనంతపురం జిల్లా శింగనమల మండల వైకాపా మాజీ కన్వీనర్, అసమ్మతి నాయకుడు పట్నం నగేశ్ మామిడి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. -
భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే
రాష్ట్రంలో పోటీ చేయనున్న పది అసెంబ్లీ స్థానాలకు భాజపా అధినాయకత్వం బుధవారం అభ్యర్థుల్ని ప్రకటించింది. వీరిలో సుజనాచౌదరికి కేంద్ర మంత్రిగా, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డిలకు రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించిన అనుభవం ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్