ఓటుకు ‘డిజిటల్‌’ నోటు

డబ్బులు వెదజల్లి ఓటర్లను కొనడం ఈరోజుల్లో పరిపాటిగా మారింది. అయితే ఈ డిజిటల్‌ యుగంలో అది కొత్తపుంతులు తొక్కుతోంది. ఇంతకముందులా ఇంటికొచ్చి నోట్లు పంచడం కాకుండా మొబైల్‌ నంబర్‌ ఇస్తే చాలు ఓటర్ల అకౌంట్‌లోకే డబ్బులు బదిలీ చేస్తున్నారు రాజకీయ నేతలు....

Updated : 29 Feb 2024 15:30 IST

ఓటర్ల ఫోన్‌ నంబర్లు సేకరిస్తూ చెల్లింపులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: డబ్బులు వెదజల్లి ఓటర్లను కొనడం ఈరోజుల్లో పరిపాటిగా మారింది. అయితే ఈ డిజిటల్‌ యుగంలో అది కొత్తపుంతలు తొక్కుతోంది. ఇంతకముందులా ఇంటికొచ్చి నోట్లు పంచడం కాకుండా మొబైల్‌ నంబర్‌ ఇస్తే చాలు ఓటర్ల అకౌంట్‌లోకే డబ్బులు బదిలీ చేస్తున్నారు రాజకీయ నేతలు. ఇంటింటి ప్రచారం పేరిట రాజకీయ నాయకులు చేస్తున్నదల్లా మొబైల్‌ నంబర్ల సేకరణే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ నంబర్ల సేకరణ కోసం కూడా ప్రత్యేకంగా ఏజెన్సీలు పెట్టుకున్న అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇలాంటి ఘటనలపైనే తమిళనాడులో విపక్ష డీఎంకే.. అధికార అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థిపై ఈసీకి లేఖ రాసింది. 

తొండముత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మంత్రి ఎస్పీ వేలుమణి ఓటర్ల ఫోన్‌ నంబర్లు సేకరించి గూగుల్‌ పే సహా ఇతర డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌ల ద్వారా వారికి చెల్లింపులు చేస్తున్నారన్నది ఆ ఫిర్యాదు సారాంశం. డీఎంకే ఆరోపణలను అన్నాడీఎంకే తోసిపుచ్చింది. ఓటమి ఖాయమని అర్థమైన విపక్ష డీఎంకే ఇలాంటి తప్పుడు ఆరోపణలతో ఈసీకి ఫిర్యాదులు చేస్తోందని పేర్కొంటోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఎలా ఉన్నా డిజిటల్‌ పేమెంట్లు జరుగుతున్నాయో, లేదో ఓటర్లకు మాత్రం తెలుసు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని