ఓటుకు ‘డిజిటల్’ నోటు
డబ్బులు వెదజల్లి ఓటర్లను కొనడం ఈరోజుల్లో పరిపాటిగా మారింది. అయితే ఈ డిజిటల్ యుగంలో అది కొత్తపుంతులు తొక్కుతోంది. ఇంతకముందులా ఇంటికొచ్చి నోట్లు పంచడం కాకుండా మొబైల్ నంబర్ ఇస్తే చాలు ఓటర్ల అకౌంట్లోకే డబ్బులు బదిలీ చేస్తున్నారు రాజకీయ నేతలు....
ఓటర్ల ఫోన్ నంబర్లు సేకరిస్తూ చెల్లింపులు
ఇంటర్నెట్ డెస్క్: డబ్బులు వెదజల్లి ఓటర్లను కొనడం ఈరోజుల్లో పరిపాటిగా మారింది. అయితే ఈ డిజిటల్ యుగంలో అది కొత్తపుంతలు తొక్కుతోంది. ఇంతకముందులా ఇంటికొచ్చి నోట్లు పంచడం కాకుండా మొబైల్ నంబర్ ఇస్తే చాలు ఓటర్ల అకౌంట్లోకే డబ్బులు బదిలీ చేస్తున్నారు రాజకీయ నేతలు. ఇంటింటి ప్రచారం పేరిట రాజకీయ నాయకులు చేస్తున్నదల్లా మొబైల్ నంబర్ల సేకరణే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ నంబర్ల సేకరణ కోసం కూడా ప్రత్యేకంగా ఏజెన్సీలు పెట్టుకున్న అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇలాంటి ఘటనలపైనే తమిళనాడులో విపక్ష డీఎంకే.. అధికార అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థిపై ఈసీకి లేఖ రాసింది.
తొండముత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మంత్రి ఎస్పీ వేలుమణి ఓటర్ల ఫోన్ నంబర్లు సేకరించి గూగుల్ పే సహా ఇతర డిజిటల్ పేమెంట్ యాప్ల ద్వారా వారికి చెల్లింపులు చేస్తున్నారన్నది ఆ ఫిర్యాదు సారాంశం. డీఎంకే ఆరోపణలను అన్నాడీఎంకే తోసిపుచ్చింది. ఓటమి ఖాయమని అర్థమైన విపక్ష డీఎంకే ఇలాంటి తప్పుడు ఆరోపణలతో ఈసీకి ఫిర్యాదులు చేస్తోందని పేర్కొంటోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఎలా ఉన్నా డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయో, లేదో ఓటర్లకు మాత్రం తెలుసు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM