Chandrababu: నినాదాలకే కేసులు పెట్టడం ప్రభుత్వ దిగజారుడుతనం: చంద్రబాబు
ఒంగోలులో 17 మంది తెలుగు మహిళలపై అట్రాసిటీ కేసులు పెట్టడంపై తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. నినాదాలకే కేసులు పెట్టడం
అమరావతి: ఒంగోలులో 17 మంది తెలుగు మహిళలపై అట్రాసిటీ కేసులు పెట్టడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. నినాదాలకే కేసులు పెట్టడం ప్రభుత్వ దిగజారుడుతనమని ధ్వజమెత్తారు. మహిళా నేతలపై కేసులు పెట్టడం ప్రభుత్వ బలహీనతకు నిదర్శనమన్నారు. రేపల్లె అత్యాచార బాధిత మహిళకు భరోసా ఇవ్వాలంటూ మంత్రి కాన్వాయ్ వద్ద నినాదాలు చేయడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై హింసను అరికట్టడం ప్రభుత్వం విఫలమైందని ఆక్షేపించారు.
గళమెత్తిన గొంతులను ప్రభుత్వం నొక్కే ప్రయత్నం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. అత్యాచార మహిళ పేరు ఫిర్యాదు కాపీలో రాసి బహిర్గతం చేశారన్నారు. అధికార పార్టీ నేతలు ఇంతకంటే గొప్పగా స్పందిస్తారని ఆశించడం తప్పేనేమో అని ఎద్దేవా చేశారు.ఒంగోలులో మహిళలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని.. అదుపులోకి తీసుకున్న మహిళలను విడుదల చేయాలని చంద్రబాబు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఇటీవల రేపల్లె రైల్వేస్టేషన్లో ప్రకాశం జిల్లాకు చెందిన వివాహితపై సామూహిక అత్యాచారం జరిగింది. బాధిత మహిళ ఒంగోలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పరామర్శకు వెళ్లిన హోంమంత్రి వనిత కాన్వాయ్ వద్ద తెలుగు మహిళలు నినాదాలు చేశారు. దీంతో వారిపై పోలీసులు కేసులు పెట్టిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్