Chandrababu: ఆ తల్లిదండ్రుల కడుపు కోతపై సమాధానమేంటి?: చంద్రబాబు

అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మంత్రి ఆర్భాటం కోసం పసిబిడ్డ మృతి చెందిందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Updated : 16 Apr 2022 11:50 IST

అమరావతి: అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మంత్రి ఆర్భాటం కోసం పసిబిడ్డ మృతి చెందిందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సంబరాల కోసం ట్రాఫిక్‌ నిలిపివేసి పసిపాప మృతికి కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి ఆస్పత్రికి వెళ్లడం కంటే మంత్రుల ర్యాలీలే ముఖ్యమా అని ప్రశ్నించారు. అర్ధంలేని ఆంక్షలతో చిన్నారి మృతికి కారణమైన పోలీసులు ఇప్పుడేం చెబుతారు అని నిలదీశారు. ‘‘సంబరాలు జరుపుకొన్న మంత్రి.. ఆ తల్లిదండ్రుల కడుపు కోతపై సమాధానమేంటి?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిన్న రాత్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాపను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. మంత్రి ఉషశ్రీచరణ్‌ ర్యాలీ ఉందని పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో తమ కూతురికి వైద్యం సకాలంలో అందక ప్రాణాలు కోల్పోయిందని తల్లిదండ్రులు ఆరోపించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని