Chandrababu: ఆ తల్లిదండ్రుల కడుపు కోతపై సమాధానమేంటి?: చంద్రబాబు
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మంత్రి ఆర్భాటం కోసం పసిబిడ్డ మృతి చెందిందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.
అమరావతి: అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మంత్రి ఆర్భాటం కోసం పసిబిడ్డ మృతి చెందిందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సంబరాల కోసం ట్రాఫిక్ నిలిపివేసి పసిపాప మృతికి కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి ఆస్పత్రికి వెళ్లడం కంటే మంత్రుల ర్యాలీలే ముఖ్యమా అని ప్రశ్నించారు. అర్ధంలేని ఆంక్షలతో చిన్నారి మృతికి కారణమైన పోలీసులు ఇప్పుడేం చెబుతారు అని నిలదీశారు. ‘‘సంబరాలు జరుపుకొన్న మంత్రి.. ఆ తల్లిదండ్రుల కడుపు కోతపై సమాధానమేంటి?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిన్న రాత్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాపను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. మంత్రి ఉషశ్రీచరణ్ ర్యాలీ ఉందని పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో తమ కూతురికి వైద్యం సకాలంలో అందక ప్రాణాలు కోల్పోయిందని తల్లిదండ్రులు ఆరోపించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని