Chandrababu: కుప్పంలో దాడుల సంస్కృతి దురదృష్టకరం: చంద్రబాబు

కుప్పంలో హోటల్‌పై వైకాపా కౌన్సిలర్ల దాడిని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. కుప్పంలో దాడుల సంస్కృతిని వైకాపా తీసుకురావడం దురదృష్టకరమన్నారు.

Published : 16 May 2022 12:03 IST

అమరావతి: కుప్పంలో హోటల్‌పై వైకాపా కౌన్సిలర్ల దాడిని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. కుప్పంలో దాడుల సంస్కృతిని వైకాపా తీసుకురావడం దురదృష్టకరమన్నారు. హోటల్‌లో ఫర్నీచర్‌ ధ్వంసం చేసి మహిళలను బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడి ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి తెదేపా అండగా ఉంటుందని చంద్రబాబు ట్విటర్‌ వేదికగా భరోసా ఇచ్చారు.

కుప్పం పట్టణం బైపాస్‌ మార్గంలోని ఓ దాబాలో వైకాపా నాయకులు వీరంగం సృష్టించిన సీసీ ఫుటేజీ వీడియో ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఓ కౌన్సిలర్‌, మరో కౌన్సిలర్‌ కుమారుడు, వారి అనుచరులు దాబాపై దాడి చేసినట్లు నిర్వాహకులు తెలిపిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని