Chandrababu: వచ్చే ఎన్నికల్లో యువతకు 40శాతం సీట్లు : చంద్రబాబు
హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన తెదేపా 40వ ఆవిర్భావ వేడుకల్లో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల
హైదరాబాద్: పేదరికం పోవాలన్నా, సామాన్య ప్రజల కష్టాలు తీరాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన తెదేపా 40వ ఆవిర్భావ వేడుకల్లో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కార్యకర్తలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని బలపరచాల్సిన బాధ్యత రెండు తెలుగు రాష్ట్రాలపైనా ఉందన్నారు. యువత ముందుకు వచ్చి న్యాయంకోసం పోరాడాలని పిలుపునిచ్చిన చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో యువతకు 40శాతం సీట్లు ఇస్తామని ప్రకటించారు. ‘‘రాజకీయాల్లో గాడ్ ఫాదర్ లేడని భయపడొద్దు. సమాజ హితం, రాజకీయాల్లో మార్పు తేవాలనుకుంటున్న వారు రాజకీయాల్లోకి రండి. ఆంధ్రప్రదేశ్ను పునర్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది’ అని పిలుపునిచ్చారు.
తెలుగుజాతి సంక్షేమమే పరమావధి...
‘‘ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 40 దేశాల్లో 200 నగరాల్లో తెదేపా ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. ఒక రాజకీయ పార్టీ 41సంవత్సరంలోకి అడుగుపెట్టడం అరుదైన అవకాశం. తెలుగుజాతి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో ఎమ్మెల్యే క్వార్టర్స్లో శ్రేయోభిలాషులతో ఎన్టీఆర్ మీటింగ్ పెట్టారు. ఆ విషయం తెలిసి కొన్ని వేలమంది తరలివచ్చారు. ఆ ఆవేశంలో నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం. తెలుగు జాతి ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువారి సంక్షేమమే తెదేపా పరమావధి. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. ఎప్పుడూ ప్రజాపక్షంలోనే ఉన్నాం. రూ.2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టి పేదవారి ఆకలి తీర్చారు. ప్రజలను పీడిస్తున్న పటేల్ పట్వారీ వ్యవస్థను ఒక్క కలం పోటుతో రద్దు చేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, రాజకీయాల్లో 9శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెదేపా. ప్రజల నరనరాల్లో తెదేపా జీర్ణించుకుపోయింది. తెలుగు ప్రజల గుండెచప్పుడు తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ అభివృద్ధికి కారణం ఎవరు?ఐటీ గురించి ఎవరికీ తెలియని సమయంలో భవిష్యత్కు పునాది వేశాం.
అభివృద్ధి ఫలాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి..
తెదేపా హయాంలో జినోమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టాం. నేను ప్రారంభించిన జినోమ్ వ్యాలీ నుంచి కరోనా వ్యాక్సిన్ రావడం దేశానికే గర్వకారణం. బయోటెక్నాలజీ ప్రాధాన్యత ఉందని ముందే గుర్తించాం. తెదేపా దూరదృష్టితో నాలెడ్జ్ అకాడమీకి ప్రాధాన్యత ఇచ్చింది. 5 నిమిషాలు సమయం ఇస్తామని చెప్పిన బిల్గేట్స్... నా ప్రజెంటేషన్ చూసి 30 నిమిషాలు కేటాయించారు. ఆ తర్వాత దావోస్లో కలిసినప్పుడు కూడా గుర్తు చేశా. చివరికి.. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ సెంటర్ పెడుతున్నట్టు చెప్పారు. శంషాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేశాం. ఔటర్ రింగ్రోడ్డుకు శ్రీకారం చుట్టాం. అప్పుడు నేను చేసిన అభివృద్ధి ఫలాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ అభివృద్ధిలో అడుగడుగునా నా శ్రమ ఉంది. హైదరాబాద్ మాదిరి అమరావతిని కూడా అభివృధ్ధి చేయాలనుకున్నా. నాపై నమ్మకంతో రైతులు 33వేల ఎకరాల భూమి ఇచ్చారు. వర్షం వస్తే కొట్టుకుపోతుందని కరకట్ట కమల్హాసన్లు దుష్ప్రచారం చేశారు. ఏపీ, తెలంగాణను నేను ఎప్పుడూ వేర్వేరుగా చూడలేదు. 1994కు ముందు కోకాపేటలో ఎకరం భూమి విలువ రూ.60వేలు మాత్రమే ఉండేది. ఇప్పుడు కోకాపేటలో ఎకరం భూమి విలువ రూ.60కోట్లకు పెరిగింది. అంతర్జాతీయ క్రీడలు హైదరాబాద్లో నిర్వహించాం. గోపీచంద్ అకాడమీ నుంచి ఇప్పుడు అంతర్జాతీయ క్రీడాకారులు వస్తున్నారు. ఆనాడు గోపీచంద్ అకాడమీకి భూమి ఇచ్చి ప్రోత్సహించాను’’ అని చంద్రబాబు వివరించారు.
సమర్థమైన నాయకత్వాన్ని సిద్ధం చేసుకోవాలి...
‘‘పేదరికం లేని సమాజం కోసం కృషి చేయాలని ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. సమాజమే దేవాయలం, ప్రజలే దేవుళ్లని చెప్పారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులను చదివిస్తున్నా. వైద్య శిబిరాలు, ప్రకృతి విపత్తుల సమయంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 1988లో ఎన్టీఆర్ ఆదేశాల మేరకు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేశాం. ఇప్పుడున్న ఏ రాజకీయ పార్టీ అయినా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందా? రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకుంటున్నారు. మనం అలా చేయలేదు. ప్రతి ఒక్కరూ సొంత పనులు చేసుకుని, సొంతంగా సంపాదించిన డబ్బుల్లో కొంత పార్టీ కోసం, సమాజం కోసం ఖర్చు పెట్టే పార్టీ తెలుగుదేశం. రాజకీయాల్లో విలువలు పెంచేందుకు మనం కృషి చేయాలి. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించాలి. పేదవాడికి పట్టెడన్నం దొరక్కపోతే అది అభివృద్ధి కాదు. ఈరోజు మనందరిపైన బాధ్యత ఉంది. తెలుగుజాతి ఉన్నంత వరకూ తెదేపా ఉండాల్సిన చారిత్రక అవసరం ఉంది. ఎంతో మంది కుట్రలు పన్నారు.. అయినా, తెలుగుదేశం చెక్కు చెదరలేదు కదా.. మరింత బలపడింది. మరో 40ఏళ్లకు సరిపడా సమర్థమైన నాయకత్వాన్ని సిద్ధం చేసుకోవాల్సిన అవసరముంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
పార్టీ లేకుండా చేయాలని చూశారు..: అచ్చెన్నాయుడు
తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... ‘‘ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకూ పేదవారికి సాయం చేశారు కానీ.. ఎలాంటి తప్పు చేయలేదు. తెలుగుజాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని జగన్ ఎంతో ప్రయత్నించారు. కానీ, ఏం చేయలేకపోయారు. తెదేపా నాయకులపై అక్రమ కేసులు పెట్టారు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. తెలుగుజాతి అభివృద్దికి పునరంకితమవుదాం’’ అని పార్టీ శ్రేణులకు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ... ఎన్టీఆర్ నీతివంతమైన పాలన అందించారని, ఆయన లేకపోయినా ఆదర్శాలు బతికే ఉన్నాయన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే తెదేపా లక్ష్యమని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెదేపా ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాటం చేసిందన్నారు. ఒక్కసారి అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ తెదేపా అధ్యక్షులు నర్సిహులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, కిమిడి కళావెంకట్రావు తదితరులు హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళేశ్వరం, కేసీఆర్పై ఈ ప్రభుత్వానికి కడుపు మంట
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
భారాసకు భారీ షాక్
లోక్సభ ఎన్నికల వేళ భారాసకు షాక్ మీద షాక్ తగులుతోంది. సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా భారాస వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. -
సంక్షిప్త వార్తలు
ఎన్డీయే తీరుపై భాగస్వామ్య పక్ష నేత, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అఠావలె అసంతృప్తి వ్యక్తం చేశారు. -
6న జైపుర్లో కాంగ్రెస్ మేనిఫెస్టో
లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను వచ్చే నెల 6వ తేదీన రాజస్థాన్ రాజధాని జైపుర్లో విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ నేత సుఖ్జీందర్ సింగ్ రణధావా తెలిపారు. -
జగన్పై ఒంటరిగానే నా పోరాటం
-
ఎమ్మెల్యే కాటసాని సోదరుడు చంద్రశేఖరరెడ్డితో తెదేపా మంతనాలు
నంద్యాల జిల్లా బనగానపల్లిలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖరరెడ్డితో గురువారం రాత్రి తెదేపా నేతలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బీసీ జనార్దన్రెడ్డి మంతనాలు సాగించారు. -
‘సంగం’పై ఆర్వో ఎలా స్పందిస్తారు: ధూళిపాళ్ల
కంపెనీ చట్టంలో ఉన్న సంగం డెయిరీపై వైకాపా నాయకుడు ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారని గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వోను మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రశ్నించారు. -
గుంటూరు మిర్చియార్డులో వైకాపా అభ్యర్థుల ప్రచారం
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వైకాపా గుంటూరు లోక్సభ అభ్యర్థి, పలు శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులు ఈ నెల 22న గుంటూరు మిర్చియార్డులో ప్రచారం నిర్వహించారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనాకు యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. -
వైకాపా సభ్యత్వానికి తిరుపతి కార్పొరేటర్ల రాజీనామా
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తిరుపతిలో వైకాపా అసంతృప్త నేతలు బయటపడుతున్నారు. -
వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన!
రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను వచ్చే నెల మొదటి వారంలో ప్రకటించే అవకాశాలున్నాయి. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
బాలీవుడ్, హాలీవుడ్ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
శివసేన (శిందే)లో చేరిన నటుడు గోవిందా
సార్వత్రిక ఎన్నికల ముందు బాలీవుడ్ నటుడు గోవిందా (60) మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. గురువారం ఆయన శివసేన (శిందే వర్గం) పార్టీలో చేరారు. -
కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమిటీ
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు రాష్ట్ర పార్టీ ‘తెలంగాణ ప్రజల ముంగిట్లోకి జాతీయ మ్యానిఫెస్టో’ కమిటీని ఏర్పాటు చేసింది. -
రేవంత్ అధ్యక్షతన పీఈసీ సమావేశం నేడు
కాంగ్రెస్ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ(పీఈసీ) సమావేశం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జరగనుంది. -
ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు. -
చెంగిచర్ల వెళ్లిన ఎంపీ బండి సంజయ్పై కేసు
ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు బుధవారం చెంగిచర్ల వెళ్లిన ఎంపీ బండి సంజయ్పై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఫోన్ ట్యాపింగ్పై సీబీఐ విచారణ జరిపించాలి: లక్ష్మణ్
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి