chandrababu: అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై తెదేపా కీలక నిర్ణయం
అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అనే అంశంపై గత కొన్ని రోజులుగా తెదేపాలో చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన
అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అనే అంశంపై గత కొన్ని రోజులుగా తెదేపాలో చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన వర్చువల్గా సమావేశమైన తెదేపా శాసనసభాపక్షం దీనిపై స్పష్టత ఇచ్చింది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు చంద్రబాబు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని నిర్ణయించారు. సభకు హాజరుకాకుంటే ప్రత్యామ్నాయ కార్యక్రమాలపై తొలుత పార్టీలో చర్చ జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలని, చర్చలో పాల్గొనాలని మాజీ మంత్రి, సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సూచించారు. దీంతో సీనియర్ నేతల సూచనల మేరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాల్సిందేనని నిర్ణయించారు.
ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు: అచ్చెన్నాయుడు
ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. శాసనసభ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే బడ్జెట్ సమావేశాలకు హాజరుకావాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తెదేపా శాసనసభాపక్షం సమావేశం అనంతరం అచ్చెన్నాయుడు వర్చువల్గా మీడియాతో మాట్లాడారు.
‘‘శాసనసభకు రాకుండా పారిపోతున్నామని కొందరు నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో కీలక బిల్లులపై విపక్షాలతోనూ చర్చించేవాళ్లు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే శాసనసభ్యులందరి అభిప్రాయాలు తీసుకొని చర్చించాకే నిర్ణయం తీసుకుంటారు. గత మూడేళ్లలో ఇలాంటి పరిస్థితులు లేకపోవడమే కాకుండా విపక్ష సభ్యులకు చట్టసభల్లో అవమానాలు ఎదురయ్యాయి. అమరావతిపై తీర్పుతో హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. అదే ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్తోంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్ని సమస్యలను చట్టసభల్లో ప్రశ్నిస్తాం. సభలో విపక్ష సభ్యులు మాట్లాడేందుకు సమయం ఇవ్వాలి. కొన్ని మీడియా ఛానెళ్లను ప్రభుత్వం బహిష్కరించడం తగదు. సభ ప్రసారాలకు అన్ని ఛానెళ్లను అనుమతించాలి’’ అని అచ్చెన్నాయుడు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్