AP News: చెరో పెట్రోల్ డబ్బా తెచ్చుకుందాం.. తేల్చుకుందాం: బొండా ఉమ
తప్పు చేయకుంటే నిజనిర్ధరణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారో మంత్రి కొడాలి నాని చెప్పాలని తెదేపా
విజయవాడ: ఏ తప్పూ చేయకుంటే నిజనిర్ధరణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారో మంత్రి కొడాలి నాని చెప్పాలని తెదేపా సీనియర్ నేత బొండా ఉమా ప్రశ్నించారు. గుడివాడలో కొడాలి నానికి చెందిన కె-కన్వెన్షన్ సెంటర్లో సంక్రాంతి సందర్భంగా క్యాసినో నిర్వహించినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం తెదేపా నిజనిర్ధారణ కమిటీ కన్వెన్షన్ సెంటర్ను పరిశీలించడానికి వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీనిపై కొడాలి నాని కూడా దీనిపై స్పందిస్తూ క్యాసినో, పేకాట నిర్వహించారని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొని, పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బొండా ఉమా విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
‘‘కొడాలి నాని దొరికిపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మంత్రి సవాల్ను స్వీకరిస్తున్నాం. క్యాసినో జరిగిందని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు రావాలో చెప్పండి. చెరో పెట్రోల్ డబ్బా తెచ్చుకుందాం.. తేల్చుకుందాం. క్యాసినోలో డ్యాన్స్లు వేసిన వారి పేర్లూ మా వద్ద ఉన్నాయి. విక్టర్, శశిభూషణ్ వంటి వాళ్లు డ్యాన్స్లు వేశారు. కరోనా వచ్చిందని హైదరాబాద్లో ఉంటే చేసిన తప్పులు పోతాయా?
క్యాసినో జరగలేదంటే పెట్రోల్ పోసుకునేందుకు నేను సిద్ధం. రుజువైతే మంత్రి పదవికి రాజీనామా చేయి చాలు. క్యాసినో జరిగిందని మీడియా సమక్షంలో నిరూపణకు సిద్ధం. అర్ధనగ్న నృత్యాలు జరిగితే తానే ఆపించానని నాని ఒప్పుకొన్నారు’’ అని బొండా ఉమా అన్నారు. ఈ సందర్భంగా ఆయన కన్వెన్షన్ సెంటర్లో జరిగిన క్యాసినో వీడియోలను మీడియాకు విడుదల చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు