Buddha venkanna: తెదేపా నేత బుద్దా వెంకన్న అరెస్టు
తెదేపా నేత బుద్దా వెంకన్నను పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం మీడియా సమావేశంలో ఏపీ మంత్రి కొడాలి నాని, డీజీపీ సవాంగ్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన్ను ప్రశ్నించేందుకు...
విజయవాడ: తెదేపా నేత బుద్దా వెంకన్న(buddha venkanna)ను పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం మీడియా సమావేశంలో ఏపీ మంత్రి కొడాలి నాని, డీజీపీ సవాంగ్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన్ను ప్రశ్నించేందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3 గంటలుగా వాదోపవాదాలు జరిగిన తర్వాత వెంకన్నను పోలీసులు అరెస్టు చేసి విజయవాడ వన్టౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. తాను మాట్లాడిన మాటలు వాస్తవమేనని, డీజీపీ సవాంగ్.. సీఎం జగన్కు తొత్తుగా పని చేస్తున్నారని బుద్దా వెంకన్న ఈ సందర్భంగా ఆరోపించారు..
ఈరోజు ఉదయం మీడియా సమావేశంలో బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. సంక్రాంతికి గుడివాడలో క్యాసినో నిర్వహించారని, అందులో డీజీపీ వాటా ఉన్నందునే మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. తెదేపా అధినేత చంద్రబాబు ఇంటివైపు వస్తే కొడాలి నానిని చంపడానికైనా.. తాను చావడానికైనా సిద్ధమని బుద్దా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!