AP News: షర్మిల ఏపీలో పార్టీ పెడితే మొదట చేరేది ఆయనే: బుద్దా వెంకన్న
రాష్ట్రంలోని సమస్యలను దృష్టి మరల్చేందుకే మంత్రి కొడాలి నాని తెదేపా అధినేత చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని
విజయవాడ: రాష్ట్రంలోని సమస్యలను దృష్టి మరల్చేందుకే మంత్రి కొడాలి నాని తెదేపా అధినేత చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఇకపై చంద్రబాబు గురించి మాట్లాడితే అదే రీతిలో బుద్ధి చెబుతామని ఆయన మండిపడ్డారు. సీఎం జగన్ రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకురావడం లేదని గుడివాడలో కొడాలి నాని క్యాసినో పరిశ్రమను తీసుకొచ్చారని విమర్శించారు. విజయవాడలో ఆ పార్టీ నేత నాగుల్ మీరాతో కలిసి బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడారు.
‘‘చంద్రబాబు గురించి మాట్లాడితే మేం పదిరెట్లు స్పందిస్తాం. షర్మిల ఏపీలో పార్టీ పెడితే.. చేరే మొదటి వ్యక్తి కొడాలి నాని. సుపరిపాలన చేతగాకే చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. జోగి రమేశ్లా చంద్రబాబు ఇంటి వైపు ఎవరైనా వస్తే చావగొట్టి పంపుతాం. డీజీపీ తీరు డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీగా ఉంది. గుడివాడలో కొడాలి నాని ఆయిల్ దొంగతనాలు చేశారు. కొడాలిపై అప్పటి పోలీసు అధికారి వర్ల రామయ్య చర్యలు తీసుకోలేదా?’’ అని బుద్దా వెంకన్న అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం