Andhra News: మైలవరంలో తెదేపా నేత దేవినేని ఉమ అరెస్టు
కృష్ణా జిల్లా మైలవరంలో తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. మైలవరాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ
మైలవరం: కృష్ణా జిల్లా మైలవరంలో తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. మైలవరాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ మైలవరంలో దేవినేని నిరసన చేపట్టారు. మైలవరం రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకోలో దేవినేని పాల్గొన్నారు. మైలవరాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని డిమాండ్ చేస్తూ గత నెల రోజులుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇవాళ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను ఖరారు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, గుడివాడను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేస్తూ ఆమోదం తెలిపింది. మైలవరాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దేవినేని ఉమ ఆధ్వర్యంలో నేతలు మైలవరం నాలుగు రోడ్ల కూడలిలో బైఠాయించి నిరసన తెలిపారు. నిరసనను ఉపసంహరించుకోవాలని పలుమార్లు పోలీసులు కోరినప్పటికీ దేవినేని వినకుండా నిరసన కొనసాగించారు. దాదాపు 3 గంటలపాటు నిరసన తెలుపడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడమే కాకుండా తెదేపా శ్రేణులు పెద్దఎత్తున ధర్నా ప్రదేశానికి చేరుకుంటుండటంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో దీక్ష విరమించేది లేదని దేవినేని తేల్చి చెప్పడంతో ఆయనను మైలవరం పోలీసుస్టేషన్కు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ