అమరావతిపై భాజపా వైఖరేంటి?: అయ్యన్న

అమరావతిపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత భాజపాపైనా ఉందని తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. రాజధానిగా అమరావతికి..

Published : 10 Aug 2020 01:03 IST

విశాఖపట్నం: అమరావతిపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత భాజపాపైనా ఉందని తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. రాజధానిగా అమరావతికి అనుకూలమని భాజపా భావిస్తుందా? అని ప్రశ్నించారు. కేంద్రం జోక్యం చేసుకునేలా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర భాజపాదేనని చెప్పారు. అమరావతి అంశంలో ద్వంద్వ వైఖరి సరికాదని హితవు పలికారు. ప్రజారోగ్యం కంటే రాజకీయాలకే మంత్రులు ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. అమరావతి తరలింపు కూడా రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. మరోవైపు విష జ్వరాలు ప్రబలుతున్నారని చెప్పారు. విష జ్వరాలపై మంత్రులు, కలెక్టర్లు, ఐటీడీఏ అధికారులు స్పందించట్లేదని అయ్యన్న పాత్రుడు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని