AndhraPradesh News: ఆర్థిక పరిస్థితిపై ఇంకెన్నాళ్లు పిట్టకథలు: పయ్యావుల
చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతప్రతం విడుదల చేయాలని తెదేపా సీనియర్ నేత పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.
అమరావతి: చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతప్రతం విడుదల చేయాలని తెదేపా సీనియర్ నేత పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన ఇంకెంతకాలం పిట్టకథలతో నెట్టుకొస్తారని ఆయన మండిపడ్డారు. ఆర్థిక పరిస్థితిపై మంత్రి పొంతన లేని ప్రకటనలు విడుదల చేస్తున్నారని విమర్శించారు. మూలధన వ్యయం ఎంత, రాష్ట్ర ఆదాయం ఎంతో స్పష్టం చేయాలని పయ్యావుల డిమాండ్ చేశారు. పథకాలకు ఖర్చు చేసే మొత్తం కంటే ప్రకటనలకు వెచ్చించిందే ఎక్కువని ఆరోపించారు. కొత్త పెట్టుబడులు రాక రాష్ట్రాన్ని 20ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదాయం బాగున్నప్పుడు పొరుగు రాష్ట్రాల మాదిరి ఎందుకు జీతాల్లేవేంటని నిలదీశారు. మరో తరం పాటు రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశారని మండిపడ్డారు. శాఖల వారీగా ఎంత ఖర్చు చేశారో చెప్పే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. ఎఫ్ఆర్బీఎం పరిధి కంటే రెండు రెట్లు ఎక్కువ అప్పులు చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి ఏ బ్యాంకు అప్పు ఇచ్చే పరిస్థితి లేదని పయ్యావుల ఎద్దేవా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ