Andhra News: గోదాట్లో కొట్టుకుపోతున్న గ్రామసింహం తోక ఎవరూ పట్టుకోరు: సోమిరెడ్డి

అవినీతి, అరాచకాల కంపుకొట్టే వైకాపా పక్కన నిలబడేందుకు ఏ రాజకీయ పార్టీ కూడా ఇష్టపడదని మాజీ మంత్రి, తెదేపా

Updated : 09 May 2022 12:14 IST

అమరావతి: అవినీతి, అరాచకాల కంపుకొట్టే వైకాపా పక్కన నిలబడేందుకు ఏ రాజకీయ పార్టీ కూడా ఇష్టపడదని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఎవరితోనూ పొత్తుపెట్టుకోవడం లేదని వైకాపా చెబుతోందని.. కానీ ఆ పార్టీతో చేయికలిపేందుకు ఎవరూ సిద్ధంగా లేరని చెప్పారు. ఈ మేరకు సోమిరెడ్డి ట్వీట్‌ చేశారు. ‘‘గోదాట్లో కొట్టుకుపోతున్న గ్రామసింహం తోక ఎవరూ పట్టుకోరనే నిజాన్ని కప్పిపెట్టి.. సింహంలా ఒంటరిగా వస్తామని గొప్పలు చెప్పుకోవడం చూసి జనం నవ్విపోతారు’’ అని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని