జగన్‌కు నోటీసు ఇవ్వాలి: వర్ల రామయ్య

ముఖ్యమంత్రి జగన్‌కు 91 సీఆర్పీసీ కింద నోటీసు ఇవ్వాలని తెదేపా పొలిట్‌బ్యూరో సబ్యుడు వర్ల రామయ్య ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు లేఖ రాశారు. లేఖతో పాటు సీఎం ప్రసంగం వీడియోను..

Updated : 13 Jan 2021 13:04 IST

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌కు 91 సీఆర్పీసీ కింద నోటీసు ఇవ్వాలని తెదేపా పొలిట్‌బ్యూరో సబ్యుడు వర్ల రామయ్య ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు లేఖ రాశారు. లేఖతో పాటు సీఎం ప్రసంగం వీడియోను జత చేశారు.  

నెల్లూరులో ఏర్పాటు చేసిన ‘అమ్మ ఒడి’ సభలో రాజకీయ ఉపన్యాసం చేస్తూ  దేవాలయాలపై దాడులు చేస్తున్న వారు తనకు తెలుసంటూ ముఖ్యమంత్రి సెలవిచ్చారని విమర్శించారు. డీజీపీ వెంటనే ముఖ్యమంత్రికి నోటీసు ఇచ్చి .. దేవాలయాలు ధ్వంసం చేసింది ఎవరో రాబట్టాలని వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చిన పోలీసులు ముఖ్యమంత్రికి ఇవ్వడానికి వెనుకడుగు వేయకూడదని వర్ల రామయ్య హితవు పలికారు. చట్టానికి ముఖ్యమంత్రి అతీతులు కాదని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి..

అదే నా తప్పయితే క్షమించండి: చంద్రబాబు

తెలుగు రాష్ట్రాల్లో ‘భోగి’ సందడి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు