Yanamala: జగన్ మాటలు తేనె పూసిన కత్తులు.. ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు?: యనమల
సొమ్మొకది.. సోకొకడిది అన్న చందంగా సీఎం జగన్ వైఖరి ఉందని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు.
అమరావతి: సొమ్మొకరిది.. సోకొకడిది అన్న చందంగా సీఎం జగన్ వైఖరి ఉందని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. మత్స్యకారులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని 6 నెలలుగా తొక్కిపట్టి.. ఇవ్వాల్సిన దానిలో సగం పెండింగ్ పెట్టింది జగన్ కాదా? అని ఆయన ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
దుష్టబుద్ధి, వక్రబుద్ధి జగన్దేనని యనమల విమర్శించారు. కోనసీమ జిల్లా మురమళ్లలో సీఎం చెప్పిన మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఓఎన్జీసీ పైపులైన్లతో నష్టపోయిన మత్స్యకారులకు ఇచ్చే పరిహారం కేంద్రానిదని.. అదేదో తానే సొంతంగా జేబులోంచి ఇస్తున్నట్లుగా జగన్ ఫోజులు కొట్టడం హాస్యాస్పదమన్నారు.
మీ దోపిడీ సొమ్ము జమచేస్తే ఇంత ఆర్థిక సంక్షోభం ఉండేదా?
సీఎం మాటలు తేనెపూసిన కత్తులని. మాయ మాటలతో ఎన్నాళ్లు మోసం చేస్తారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మూడేళ్ల నిర్వాకాలను ప్రజలే నిలదీస్తున్నారని.. ఇంకెన్నాళ్లు ప్రతిపక్షాలను ఆడిపోసుకుంటారని ఆయన మండిపడ్డారు. జగన్ దోపిడీ సొమ్ము ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తే ఇంత ఆర్థిక సంక్షోభం ఉండేదా? అని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ల స్వీకరణకు వేళాయే.. సన్నద్ధమవుతున్న రాజకీయ పార్టీలు
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది. -
అనంత్నాగ్ నుంచి ఆజాద్ పోటీ చేయట్లేదు: డీపీఏపీ ప్రకటన
లోక్సభ ఎన్నికల్లో అనంత్నాగ్- రాజౌరి సీటు నుంచి కేంద్ర మాజీమంత్రి ఆజాద్ పోటీ చేయట్లేదని ఆయన స్థాపించిన డీపీఏపీ పార్టీ ప్రకటించింది. -
జగన్.. గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు: చంద్రబాబు
గొడ్డలి పోటు, కోడికత్తి డ్రామాలు ఆడిన జగన్ .. ఇప్పుడు గులకరాయి నాటకం ఆడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
మద్యం నిషేధిస్తానని.. జగన్ సారా వ్యాపారిగా మారారు: పవన్
మద్యం నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్.. సారా వ్యాపారిగా మారారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. -
పేదలకు ఉచితంగా 10 వంట గ్యాస్ సిలిండర్లు.. టీఎంసీ మేనిఫెస్టో విడుదల
లోక్సభ ఎన్నికలకు తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. కేంద్రంలో ‘ఇండియా’ కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేస్తే పేదలకు ఉచితంగా 10 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చింది. -
కేసీఆర్, రేవంత్ డూప్ ఫైట్ చేస్తున్నారు: లక్ష్మణ్
హామీలు నేరవేర్చనందుకు కాంగ్రెస్ నేతలు ప్రజల ఆగ్రహం చవిచూస్తున్నారని భాజపా రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. -
‘ఇండియా’ కూటమి గెలిస్తే CAA, NRC రద్దు చేస్తాం: మమత
ప్రధాని నరేంద్ర మోదీని మూడోసారి గెలిపిస్తే.. దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు ఉండవని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. -
మోదీ వేవ్ లేదట.. వివాదంలో భాజపా అభ్యర్థి నవనీత్ రాణా
భాజపా అభ్యర్థి నవనీత్ రాణా (Navneet Rana) ఎన్నికల ప్రచార వీడియో వైరల్ కావడంతో.. విపక్షాలు ఆ పార్టీపై వ్యంగ్యాస్త్రాలు విసిరాయి. -
నారా లోకేశ్ సమక్షంలో తెదేపాలోకి భారీగా చేరికలు
గుంటూరు జిల్లాల్లోని పలు నియోజకవర్గాలకు చెందిన వైకాపా నేతలు బుధవారం లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరారు. -
‘ఆప్ కా రామరాజ్య’ వెబ్సైట్ను ప్రారంభించిన ఆప్
లోక్సభ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త ఆలోచనతో ప్రజల ముందుకువచ్చింది. బుధవారం రామనవమిని పురస్కరించుకొని ‘ఆప్ కా రామరాజ్య’ వెబ్సైట్ను ఆప్ ప్రారంభించింది. -
ఎన్నికల్లో భాజపా తుడిచిపెట్టుకుపోతుంది: అఖిలేష్ యాదవ్
ఎన్నికల్లో ఘజియాబాద్ నుంచి ఘాజీపూర్ వరకు భాజపా తుడిచిపెట్టుకుపోతుందని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బుధవారం పేర్కొన్నారు. -
ఉన్మాది అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో అమరావతే ఉదాహరణ: పెమ్మసాని
ఏపీ రాజధాని అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని సీఎం జగన్ అబద్ధాలు చెప్పారని, ఐదేళ్లలో ఒక్కటి కూడా నిరూపించలేకపోయారని తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. -
వలసలు, పస్తులు లేని వికసిత ఏపీ మనందరి బాధ్యత: పవన్
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే జనసేన అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బీఫామ్లు అందజేశారు. -
సీఎంపై రాయి దాడి ఘటనలో బొండా ఉమాను ఇరికించే కుట్ర: చంద్రబాబు
సీఎం జగన్పై రాయి దాడి ఘటనలో నీచమైన డ్రామాలతో అధికార పార్టీ అభాసుపాలైందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో తమ నేతలపై వైకాపా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. -
మూడు నెలల్లో భారాస దుకాణం బంద్: మంత్రి కోమటిరెడ్డి
లోక్సభ ఎన్నికల్లో భారాసకు ఒక్క సీటు కూడా రాదని.. వస్తే తాను దేనికైనా సిద్ధమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఆ పార్టీ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. -
రాయి దాడి కేసు.. బీసీ యువకులను బెదిరిస్తున్నారు: కేశినేని చిన్ని
గులకరాయి దాడి కేసులో పోలీసులు అధికార పార్టీ కనుసన్నల్లో తెదేపాపై కుట్ర పన్నారని విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఆరోపించారు. -
గులకరాయి డ్రామా.. జగన్లో మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి: అచ్చెన్నాయుడు
సానుభూతి కోసం చేసిన గులకరాయి డ్రామాలో బీసీ బిడ్డను బలిచ్చేందుకు సీఎం జగన్ కుట్ర చేశారని తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. -
మునుపెన్నడూ లేనంత తక్కువగా.. 326 సీట్లలోనే కాంగ్రెస్ పోటీ..
దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్.. మునుపెన్నడూ లేనంత తక్కువగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 326 స్థానాల్లో పోటీ చేస్తోంది. వాటిలో ఇప్పటివరకు 281 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. -
రాష్ట్రానికి విజనరీ కావాలా.. ప్రిజనరీ కావాలా?
ధర్మానికి, అధర్మానికి; న్యాయానికి, అన్యాయానికి; నీతికి, అవినీతికి; టూరిజానికి, శాడిజానికి; విజనరీకి, ప్రిజనరీకి మధ్య జరుగుతున్న పోరాటంలో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని తెలంగాణ తెదేపా నేత నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. -
త్రిమూర్తులుపై వేటా.. సీటా..?
దళితుల శిరోముండనం కేసులో శిక్ష పడిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును ఇప్పుడు మండపేట నియోజకవర్గ అభ్యర్థిగా వైకాపా తప్పిస్తుందా..? లేదా ఎమ్మెల్సీ అనంతబాబులాగే కొనసాగిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. -
ఎన్నికల్లో కూటమి ప్రభంజనం ఖాయం
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించబోతోందని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ధీమా వ్యక్తంచేశారు.