Andhra news : జగన్‌ గారూ.. అక్కాచెల్లెమ్మలపై ఆప్యాయత ఎక్కడికి పోయింది?: లోకేశ్‌

రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయని తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేశ్‌ విమర్శించారు.   ‘అక్క చెల్లెమ్మలపై కురిపించిన ఆప్యాయత ఎక్కడికి

Updated : 29 Jan 2022 15:38 IST

విజయవాడ: రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు. ‘అక్కా చెల్లెమ్మలపై కురిపించిన ఆప్యాయత ఎక్కడికి పోయింది జగన్‌ గారూ?’ అని వ్యాఖ్యానించారు. ఆడబిడ్డలపై అకృత్యాలు పెరుగుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని దుయ్యబట్టారు. ‘మద్యపాన నిషేధం’ వరమిస్తున్నానని గతంలో చెప్పిన సీఎం.. ప్రభుత్వంతోనే మద్యం విక్రయించడంపై ఏం సమాధానం చెబుతారని విమర్శించారు. మహిళలపై అకృత్యాలకు నిరసనగా.. ఈ నెల 31న తెదేపా కేంద్ర కార్యాలయంలో తెలుగు మహిళా ఆధ్వర్యంలో నిర్వహించనున్న నారీ సంకల్ప దీక్షకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు లోకేశ్‌ ప్రకటించారు. భద్రత.. భవిష్యత్‌ కోసం మహిళలు సాగించే పోరాటానికి అండగా ఉంటానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని