Darapaneni Narendra: తెదేపా మీడియా ఇన్ఛార్జి నరేంద్రకు బెయిల్ మంజూరు
తెదేపా మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్రబాబుకు బెయిల్ లభించింది. అర్ధరాత్రి 2 గంటలకు నరేంద్రను సీఐడీ అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి వైద్యుల నివేదికను అందించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత నరేంద్రకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.
గుంటూరు: తెదేపా మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్రబాబుకు బెయిల్ లభించింది. గన్నవరం విమానాశ్రయంలో ఇటీవల వెలుగుచూసిన బంగారం స్మగ్లింగ్కు సంబంధించి సీఎంఓలోని ఓ కీలక అధికారికి సంబంధం ఉందని వాట్సప్ గ్రూపులో పోస్టులు ఫార్వర్డ్ చేశారన్న ఆరోపణలతో బుధవారం రాత్రి సీఐడీ అధికారులు నరేంద్రను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. గురువారం సాయంత్రం 6 గంటలకు న్యాయమూర్తి ఎదుట హజరుపరిచేందుకు గుంటూరులోని సీఐడీ ప్రత్యేక న్యాయస్థానం ప్రాంగణానికి తీసుకొచ్చారు. అప్పటికే కోర్టు సమయం ముగిసిపోవడంతో న్యాయమూర్తి ఇంటివద్ద హాజరుపరిచారు. నరేంద్ర వాంగ్మూలం నమోదుచేసుకున్న న్యాయమూర్తి కె.శృతవింద ఆయనకు జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య రాత్రి 10.30 గంటల సమయంలో నరేంద్రను గుంటూరు జీజీహెచ్కు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం ఆయనను న్యాయమూర్తి ఇంటికి పోలీసులు తీసుకొచ్చారు. అర్ధరాత్రి 2 గంటలకు సీఐడీ అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి వైద్యుల నివేదికను అందించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత నరేంద్రకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ల కోలాహలం షురూ
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల కోలాహలం ప్రారంభమైంది. రాజకీయ సందడి ఊపందుకుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికల అధికారులు గురువారం ఉదయం నోటిఫికేషన్లు జారీ చేశారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం
వచ్చే సంవత్సర కాలంలో ఏదైనా జరగొచ్చని, లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా అభివృద్ధి చేశా
ఓటు వేసి గెలిపించిన ఓటరు తలదించుకునేలా తాను ఏ రోజూ వ్యవహరించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని కోరారు. -
పదేళ్లలో రాష్ట్రానికి భారాస, భాజపా చేసింది శూన్యం
గత పదేళ్లలో రాష్ట్రంలోని భారాస, కేంద్రంలోని భాజపా ప్రభుత్వాలు తెలంగాణకు చేసింది శూన్యమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. -
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
ఇటీవల తన తల్లి మృతి నేపథ్యంలో హమీర్పుర్ సీటు తనకు ఇచ్చినా పోటీ చేసే ఉద్దేశం లేదని డిప్యూటీ సీఎం కుమార్తె ఆస్తా అగ్నిహోత్రి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె