AP Assembly: రెండోరోజూ స్పీకర్ పోడియం వద్ద తెదేపా ఎమ్మెల్యేల నిరసన
తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్ను నిరసిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు రెండో రోజూ శాసనసభలో ఆందోళనకు దిగారు.
అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్ను నిరసిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు రెండో రోజూ శాసనసభలో ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ‘చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలి’, ‘సైకో పాలన నశించాలి’ అంటూ నినదించారు.
స్పీకర్ పోడియం వద్ద తెదేపా ఎమ్మెల్యేల నిరసనపై మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, అంబటి రాంబాబు మాట్లాడారు. సభలో నిరసన తెలిపేందుకు కొన్ని విధానాలు ఉంటాయని బుగ్గన అన్నారు. అంబటి మాట్లాడుతూ సీఎం జగన్, పాలన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోబోమని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ అంశంపై చర్చ జరుగుతుందని.. అందులో తెదేపా ఎమ్మెల్యేలు పాల్గొనాలని సూచించారు.
ఇద్దరు తెదేపా ఎమ్మెల్యేల సస్పెన్షన్
సభలో తెదేపా నిరసన నేపథ్యంలో ఇద్దరు తెదేపా ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు. కింజరాపు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్లను ఈ సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేసినట్లు ఆయన ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై పోలీసు కేసు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి (MLA Kaushik Reddy)పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
TS News: తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు.. ఇక ముఖ్యమంత్రే తరువాయి!
తెలంగాణలో కొత్త శాసనసభను ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ అయ్యింది. గవర్నర్ తమిళిసైకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈ గెజిట్ను అందజేశారు. -
Kishan Reddy: నిరాశను దరి చేరనీయం.. మా లక్ష్యం కోసం పనిచేస్తాం: కిషన్రెడ్డి
కామారెడ్డిలో ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రిని ఓడించి చరిత్ర సృష్టించామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. -
KTR: తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్
తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) తెలిపారు. తెలంగాణ భవన్లో భారాస (BRS) ముఖ్యనేతలు ఇవాళ సమావేశమయ్యారు. -
Mamata Banerjee: కూటమితో కలిసి రాకపోవడం వల్లే కాంగ్రెస్ ఓటమి: మమత
ఇండియా కూటమి పార్టీలతో కలిసి రాకపోవడం వల్లే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. -
Mayawati: ఏకపక్ష ఫలితాలు ఆందోళనకరం: మాయావతి
లోక్సభ ఎన్నికలకు వ్యూహం సిద్ధం చేసేందుకు బీఎస్పీ జాతీయ స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఇక తాజాగా విడుదలైన ఎన్నికల ఫలితాలపై ఆపార్టీ అధినేత్రి మాయావతి స్పందించారు. -
PM Modi: కుటుంబం బాధలో ఉన్నా.. పార్టీని గెలిపించారు: నడ్డాపై ప్రధాని ప్రశంసలు
భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అవిశ్రాంతంగా పనిచేసి పార్టీని మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకొచ్చారని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
Yuvagalam: తుపాను ఎఫెక్ట్.. యువగళం పాదయాత్రకు తాత్కాలిక విరామం
మిగ్జాం తుపాను నేపథ్యంలో యువగళం పాదయత్రికు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. -
Assembly Election Results: ఈ ఫలితాలు హస్తం పార్టీకి లాభమా.. నష్టమా..?
2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా భావిస్తున్న ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి గట్టి షాకిచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పక్కాగా గెలుస్తామనుకున్న రెండు రాష్ట్రాల్లో కూడా ఒకటి కోల్పోయింది. మొత్తంగా చూస్తే తెలంగాణలో తొలిసారి అధికారం దక్కించుకోవడమే ఆ పార్టీకి ఊరటగా మిగిలింది. ఇక ఈ ఫలితాలను పార్లమెంట్ ఎన్నికలకు అన్వయించుకొని చూస్తే.. కాంగ్రెస్కు కొంత ఊరట లభించినా.. దిల్లీ పీఠాన్ని హస్తగతం చేసుకోవడానికి ఆ పార్టీ తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. -
భాజపా ఎంపీలకు మిశ్రమ ఫలితాలు
లోక్సభ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్గా పరిగణించే నాలుగు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సవాల్గా తీసుకున్న భాజపా.. గెలుపు లక్ష్యంగా సర్వశక్తులొడ్డింది. -
దివ్యాంగుల పింఛన్ల మంజూరులో పక్షపాతం: పవన్కల్యాణ్
తమ పక్షం కాని దివ్యాంగులకు పింఛన్ల మంజూరు విషయంలో వైకాపా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ అన్నారు. -
20 ఏళ్ల క్రితం ఇలాగే..: జైరాం
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 20 ఏళ్ల క్రితం కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ గుర్తు చేసుకున్నారు. -
రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది
రాష్ట్రాన్ని కాపాడుకునే శక్తిని ప్రసాదించాలని అప్పన్నస్వామిని కోరుకున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. దుష్టశక్తులపై పోరాడే బలాన్ని ఇవ్వాలని ప్రార్థించానన్నారు. -
భాజపాను ప్రజలు ఆశీర్వదించారు: పురందేశ్వరి
కేంద్రంలో భాజపా సుపరిపాలనను మెచ్చి మూడు రాష్ట్రాల్లో ప్రజలు పట్టం కట్టి ‘ఇండియా’ కూటమికి ప్రజలు బుద్ధి చెప్పారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
‘గ్యారంటీ’లు అమలు చేయడంతోనే కాంగ్రెస్ విజయం
తెలంగాణలో కాంగ్రెస్ సాధించిన విజయంలో మా నేతల కృషి, ప్రభుత్వ గ్యారంటీ పథకాల ప్రభావం ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. -
భాజపా విజయం భవిష్యత్తుకు దిక్సూచి
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం భవిష్యత్తు ఫలితాలకు దిక్సూచిగా నిలవనుందని జనసేన అధినేత వపన్కల్యాణ్ పేర్కొన్నారు. -
తెలంగాణలో విజయంపై ఏపీ కాంగ్రెస్ సంబరాలు
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల కృషితోనే ఆ రాష్ట్ర ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించిందని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. -
ఏపీలో జగన్నూ ఓడించాలి: తులసిరెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఆదివారం వైయస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెలో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. -
ఆంధ్రాపై తెలంగాణ ఫలితాల ప్రభావం
తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం.. ఆంధ్రాపై తప్పక ప్రభావం చూపుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. -
రాష్ట్రానికి జగన్ వద్దనడానికి సవాలక్ష కారణాలున్నాయి: కన్నా లక్ష్మీనారాయణ
‘‘ఒక్క అవకాశం’ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు కొత్తగా ‘ఏపీ నీడ్స్ జగన్’ అంటూ ప్రజల్లోకి రావడం సిగ్గుచేటు. -
వ్యక్తిగత భద్రతపై పోలీసులు స్పష్టత ఇవ్వాలి
తన వ్యక్తిగత భద్రతపై జిల్లా పోలీసు యంత్రాంగం స్పష్టతనివ్వాలని మాజీ ఎమ్మెల్సీ, వైయస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ బీటెక్ రవి పోలీసులను ప్రశ్నించారు.


తాజా వార్తలు (Latest News)
-
Manipur Violence: మణిపుర్లో ఇరు వర్గాల మధ్య కాల్పులు.. 13 మంది మృతి
-
Yashasvi Jaiswal: బాదుడు సరే.. తొందరెందుకు యశస్వి.. కుదురుకోవాలి కదా!
-
Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై పోలీసు కేసు
-
Chhattisgarh: రాజవంశీయులకు బై బై.. పోటీలో ఉన్న ఏడుగురూ ఓటమి!
-
Railway: రైల్వే ‘బీస్ట్’ను చూశారా..? వైరల్ అవుతున్న వీడియో
-
Animal Movie: ‘యానిమల్’ మూవీపై రాంగోపాల్వర్మ రివ్యూ.. నాలుగున్నర గంటలున్నా తక్కువే!