‘గని పేలుడుపై వాస్తవాలు బయటకు రావట్లేదు’

మామిళ్లపల్లె గనుల పేలుడు ఘటనలో వాస్తవాలు బయటకు రావట్లేదని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆరోపించారు. ఈ వ్యవహారంలో అసలు దోషులను

Published : 13 May 2021 01:41 IST

సి.రామచంద్రయ్య జోలికి వెళ్లొద్దని ఆదేశాలిచ్చారా?
తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆరోపణలు

కడప: మామిళ్లపల్లె గనుల పేలుడు ఘటనలో వాస్తవాలు బయటకు రావట్లేదని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆరోపించారు. ఈ వ్యవహారంలో అసలు దోషులను వదిలేయాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు లీజుదారుగా వైకాపా ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య సతీమణి కస్తూరిబాయి పేరు ఉందని బీటెక్‌ రవి చెప్పారు. 2001 నుంచి 2022 వరకు లీజు పరిమితి ఉన్నట్లు తెలిపారు. గని యజమానిగా పేర్కొన్న నాగేశ్వర్‌రెడ్డిపై చాలా కేసులున్నాయని.. గతంలోనూ ఆయన జైలుకెళ్లి వచ్చారన్నారు. నాగేశ్వర్‌రెడ్డికి సబ్‌ లీజుకు ఇచ్చారా? ఇచ్చినట్లు సృష్టించారా? అని ఆయన నిలదీశారు. 

అనుమతి లేకుండా రూ.100 కోట్ల విలువైన సామగ్రిని తరలించారని బీటెక్‌ రవి ఆరోపించారు. రామచంద్రయ్య కుటుంబసభ్యుల జోలికి వెళ్లొద్దని ఆదేశాలిచ్చారా? అని పోలీసులను ప్రశ్నించారు. పేలుళ్ల ఘటనకు రామచంద్రయ్య, ఆయన సతీమణే కారణమని.. వారిపై చర్యలు తీసుకోకపోతే తెదేపా తరఫున కోర్టులో ప్రైవేట్‌ కేసు వేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని