‘గని పేలుడుపై వాస్తవాలు బయటకు రావట్లేదు’
మామిళ్లపల్లె గనుల పేలుడు ఘటనలో వాస్తవాలు బయటకు రావట్లేదని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. ఈ వ్యవహారంలో అసలు దోషులను
సి.రామచంద్రయ్య జోలికి వెళ్లొద్దని ఆదేశాలిచ్చారా?
తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపణలు
కడప: మామిళ్లపల్లె గనుల పేలుడు ఘటనలో వాస్తవాలు బయటకు రావట్లేదని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. ఈ వ్యవహారంలో అసలు దోషులను వదిలేయాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు లీజుదారుగా వైకాపా ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య సతీమణి కస్తూరిబాయి పేరు ఉందని బీటెక్ రవి చెప్పారు. 2001 నుంచి 2022 వరకు లీజు పరిమితి ఉన్నట్లు తెలిపారు. గని యజమానిగా పేర్కొన్న నాగేశ్వర్రెడ్డిపై చాలా కేసులున్నాయని.. గతంలోనూ ఆయన జైలుకెళ్లి వచ్చారన్నారు. నాగేశ్వర్రెడ్డికి సబ్ లీజుకు ఇచ్చారా? ఇచ్చినట్లు సృష్టించారా? అని ఆయన నిలదీశారు.
అనుమతి లేకుండా రూ.100 కోట్ల విలువైన సామగ్రిని తరలించారని బీటెక్ రవి ఆరోపించారు. రామచంద్రయ్య కుటుంబసభ్యుల జోలికి వెళ్లొద్దని ఆదేశాలిచ్చారా? అని పోలీసులను ప్రశ్నించారు. పేలుళ్ల ఘటనకు రామచంద్రయ్య, ఆయన సతీమణే కారణమని.. వారిపై చర్యలు తీసుకోకపోతే తెదేపా తరఫున కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్