Andhra News: తెదేపా మహానాడు తీర్మానాలకు ఆమోదం తెలిపిన పొలిట్‌బ్యూరో

ఒంగోలులో జరిగిన తెదేపా పొలిట్‌ బ్యూరో సమావేశం ముగిసింది. మహానాడు తీర్మానాలకు పొలిట్‌బ్యూరో ఆమోదం తెలిపింది.

Published : 26 May 2022 23:41 IST

అమరావతి: ఒంగోలులో జరిగిన తెదేపా పొలిట్‌ బ్యూరో సమావేశం ముగిసింది. మే 27వ తేదీ (శుక్రవారం) నుంచి ఒంగోలులో తెదేపా మహానాడు జరగనుంది. ఈనేపథ్యంలో పలు అంశాలపై చర్చ జరిగింది. మహానాడు తీర్మానాలకు పొలిట్‌బ్యూరో ఆమోదం తెలిపింది. ప్రజాప్రతినిధుల సభలో మొత్తం 17 తీర్మానాలు చేశారు. వీటిలో ఏపీకి 12, తెలంగాణకు 3, అండమాన్‌కు ఒక తీర్మానం ఉంది. రాజకీయ తీర్మానంపై పొలిట్‌ బ్యూరోలో కీలక చర్చ జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల మేరకు తీర్మానం ఉండాలని నేతలు అభిప్రాయపడ్డారు.

వైకాపా బస్సు యాత్రపై పొలిట్‌ బ్యూరోలో ప్రస్తావన వచ్చింది. బస్సు యాత్ర ఓ డ్రామా అంటూ చర్చ జరిగింది. వైకాపా 9 మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు రెడ్డి వర్గం వారేనని నేతలు గుర్తుచేశారు. లాబీయింగ్‌ చేసేవారికి రాజ్యసభ సీటు ఇచ్చారని ఈ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. వైకాపా బస్సు యాత్రను ప్రజలు పట్టించుకోవట్లేదని పలువురు నేతలు వ్యాఖ్యానించారు. ఈ భేటీలో ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి  ఎన్నికపై కళా వెంకట్రావు ప్రస్తావించారు. ఎంబీసీ నుంచి కొత్తవారికి ఏపీ అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందని సూచించారు. ఇక ఇప్పటికే ఒంగోలు పసుపువర్ణ శోభితం అయింది. మహానాడుకు పార్టీ శ్రేణులు తరలివస్తున్నాయి. పలు జిల్లాల నుంచి కార్లు, ద్విచక్రవాహనాలపై కార్యకర్తలు భారీగా ఒంగోలుకు చేరుకుంటున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని