Andhra News: అది.. జగన్‌ సకుటుంబ సపరివార సమేతంగా చేసిన కుట్ర: గోరంట్ల

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును సీఎం జగన్‌ తప్పుదోవ పట్టిస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.

Updated : 02 Mar 2022 14:52 IST

రాజమహేంద్రవరం: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును సీఎం జగన్‌ తప్పుదోవ పట్టిస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. జగన్‌ను అరెస్టు చేసి కేసు లోగుట్టును సీబీఐ వెలికితీయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాజమహేంద్రవరంలోని ప్రెస్‌క్లబ్‌లో గోరంట్ల మీడియాతో మాట్లాడారు. వివేకా కేసును తప్పుదోవ పట్టించడంలో జగనే దోషి అని చెప్పారు. జగన్‌ సకుంటుంబ సపరివార సమేతంగా చేసిన కుట్ర ఫలితమే వివేకా హత్య అని ఆరోపించారు. ఈ హత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని గోరంట్ల అన్నారు. జగన్‌ పాలనలో రాష్ట్రంలో అంతులేని అరాచకాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఆర్థిక ఉగ్రవాది పాలనలో రాష్ట్ర పరిస్థితి అధ్వానంగా మారిందని గోరంట్ల ఎద్దేవా చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని