చంద్రబాబు సీఎం అయ్యాక రాజకీయ సన్యాసం తీసుకుంటా: జేసీ ప్రభాకర్‌రెడ్డి

ప్రజా సమస్యలపై పోరాడే వాళ్లపై రౌడీషీటర్‌ కేసు నమోదు చేస్తే భయపడేది లేదని తెదేపా మాజీ

Updated : 19 Apr 2022 10:34 IST

అనంతపురం: ప్రజా సమస్యలపై పోరాడే వాళ్లపై రౌడీషీటర్‌ కేసు నమోదు చేస్తే భయపడేది లేదని తెదేపా మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అనంతపురంలో చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్‌నాయుడి ఇంటికెళ్లి పరామర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు.

కల్యాణదుర్గంలో పసిపాప మృతి విషయంలో న్యాయ విచారణ జరిపించాలని ప్రకాశ్‌నాయుడు నిరసన తెలిపితే అతనిపై రౌడీషీట్‌ తెరుస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదని కార్యకర్తల్లో  ధైర్యం నింపడానికి మరింత పని చేస్తానన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ఎన్జీవో ప్రారంభించి సేవా కార్యక్రమాలు చేస్తానని జేసీ ప్రభాకర్‌రెడ్డి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని