రాష్ట్ర బంద్‌కు తెదేపా మద్దతు: చంద్రబాబు

విశాఖ ఉక్కు కోసం ఎల్లుండి చేపట్టిన రాష్ట్ర బంద్‌కు తెదేపా మద్దతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట

Published : 03 Mar 2021 23:46 IST

అమరావతి: విశాఖ ఉక్కు కోసం ఎల్లుండి చేపట్టిన రాష్ట్ర బంద్‌కు తెదేపా మద్దతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి, కార్మిక సంఘాలకు కూడా తమ వంతుగా మద్దతు ప్రకటిస్తున్నామని వెల్లడించారు. బంద్‌ వల్ల చిత్తూరు, తిరుపతిలో తలపెట్టిన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల అంశంలో తెదేపా ఎప్పుడూ రాజీపడదని, పార్టీ నేతలు, కార్యకర్తలు బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని