Maharashtra: బలపరీక్ష ‘సెమీ-ఫైనల్’లో శిందే వర్గం విజయం!
భాజపా ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ స్పీకర్గా ఎన్నికయ్యారు....
ముంబయి: మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్పీకర్ పదవికి ఎన్నిక పూర్తయింది. ‘హెడ్ కౌంట్’ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. శివసేన తిరుగుబాటు నేత, ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గం కమలదళంతో చేతులు కలిపిన నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక ఉత్కంఠగా మారిన విషయం తెలిసిందే.
భాజపా ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ స్పీకర్గా ఎన్నికయ్యారు. ఆయనకు మొత్తం 164 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. మహా వికాస్ అఘాడీ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎమ్మెల్యే రాజన్ సాల్వికి 107 ఓట్లు దక్కాయి. కొత్తగా సీఎం పదవి చేపట్టిన ఏక్నాథ్ శిందే సర్కార్ సోమవారం బలపరీక్ష ఎదుర్కోనుంది. దీనికి ముందు స్పీకర్ ఎన్నిక జరగడంతో శిందేకు ఉన్న మద్దతు ఎంతో ఒకరోజు ముందే తెలిసిపోనుందని రాజకీయ వర్గాలు విశ్లేషించాయి. ఇప్పుడు నర్వేకర్ విజయం సాధించడంతో ఇప్పటి వరకూ శిందే శిబిరంలో ఉన్న రెబెల్ ఎమ్మెల్యేలు అందరూ ఆయన వెంటే ఉన్నారని తేలిపోయింది. రేపు జరిగే విశ్వాస పరీక్షలోనూ శిందే విజయం దాదాపు ఖాయమయ్యే అవకాశం ఉంటుంది. స్పీకర్ ఎన్నికను బలపరీక్షకు సెమీ ఫైనల్గా అభివర్ణిస్తూ వస్తుండడం గమనార్హం.
శాసనసభ సభాపతిగా ఉన్న నానా పటోలే గత ఏడాది ఫిబ్రవరిలో ఆ పదవికి రాజీనామా చేసి మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి సభాపతి పోస్టు ఖాళీగా ఉంది. అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య రాష్ట్ర సీఎంగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన ఏక్నాథ్ శిందే బల నిరూపణ కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నేడు, రేపు జరుగుతున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం