Bandi Sanjay: 6 రోజులుగా ఆందోళన చేస్తున్నా.. కేసీఆర్కు పట్టదా?: బండిసంజయ్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
బాసర: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ఆయన లేఖ రాశారు. ఆరు రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నా.. సీఎంకు పట్టదా?అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల న్యాయమైన 12 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. ‘‘జాతీయపార్టీ ఏర్పాటుకు మాత్రం సీఎంకు సమయం ఉంటుందా? విద్యార్థి సంఘాలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేయాలి. మంత్రులు, అధికారులు, విద్యార్థులతో మైండ్ గేమ్ ఆడటం మానుకోవాలి’’ అని కేసీఆర్కు రాసిన లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు.
ఏడో రోజూ కొనసాగుతున్న ఆందోళన
మరోవైపు బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన ఏడో రోజూ కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ట్రిపుల్ఐటీ వద్ద పోలీసులు మూడంచెల బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక విద్యార్థులతో ఆర్జీయూకేటీ డైరెక్టర్ సతీశ్ కుమార్, కలెక్టర్ ముష్రాఫ్ అలీ జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. మంత్రులు కేటీఆర్, సబితతో రాతపూర్వక హామీ ఇప్పించాలని విద్యార్థులు పట్టుబట్టడంతో చర్చలు ఎటూ తెగలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...