Telangana News: గవర్నర్‌ తమిళిసైతో కాంగ్రెస్‌ నేతల భేటీ

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ నేతల బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో భేటీ అయ్యారు.

Updated : 13 Apr 2022 10:59 IST

హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ నేతల బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కీ, పొన్నం, బలరాం నాయక్, నాగం జనార్ధన్‌రెడ్డి, వీహెచ్, కొదందరెడ్డి, దాసోజు శ్రవణ్‌ తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు సీఎల్పీ కార్యాలయంలో ఈ నాయకులు సమావేశమై రాజ్‌భవన్‌కు బయల్దేరారు. రాష్ట్రంలో నిరుద్యోగం, 111 జీవో, విద్యుత్ ఛార్జీల పెంపు, డ్రగ్స్ తదితరాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేయాలని, వెంటనే అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నేతలు వినతిపత్రం సమర్పించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని