గవర్నర్‌ చూపు ఎప్పుడూ భాజపా వైపే.. ఆమె మాటల్ని ఎవరూ నమ్మరు: ఇంద్రకరణ్‌రెడ్డి

గవర్నర్‌ తమిళిసై హుందాగా వ్యవహరిస్తే ఆమెకు గౌరవం ఉంటుందని తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

Updated : 08 Apr 2022 11:48 IST

నిర్మల్‌: గవర్నర్‌ తమిళిసై హుందాగా వ్యవహరిస్తే ఆమెకు గౌరవం ఉంటుందని తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్‌ విమర్శల నేపథ్యంలో మంత్రి స్పందించారు. నిర్మల్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.

గవర్నర్‌ యాదాద్రికి వెళ్లే 10 నిమిషాల ముందు చెబితే ప్రొటోకాల్‌ ఎలా సాధ్యమని ఇంద్రకరణ్‌రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటివరకు ఐఏఎస్‌, ఐపీఎస్‌లే గవర్నర్లగా వచ్చారని చెప్పారు. గవర్నర్‌ తమిళిసై ఎప్పుడూ భాజపావైపే చూస్తారని.. ఆమె మాటలను ఎవరూ నమ్మే అవకాశం లేదని మంత్రి వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధంగా గవర్నర్‌కు ఇచ్చే మర్యాద తప్పక ఇస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని