
Telangana News: గుజరాత్ సీఎంగా మోదీ చెప్పిన విషయాలే మేం ప్రస్తావిస్తున్నాం: నిరంజన్రెడ్డి
దిల్లీ: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చాలా హేళనగా మాట్లాడారని.. తెలివి తనకు మాత్రమే ఉందన్నట్టు, ఇతరులకు లేదన్నట్టు మభ్యపెట్టే విధంగా మాట్లాడారని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను పీయూష్ గోయల్ అవహేళన చేసేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు, తెరాస ఎంపీలతో కలిసి దిల్లీలో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘‘రా రైసా, బాయిల్డ్ రైసా అనేది మాకు సంబంధం లేదు. ఎట్లా పట్టించుకుంటారో మిల్లర్లతో మీరే పట్టించుకోండి.. మాకేం సంబంధం లేదు. యంత్రాంగం ఉంటుంది కాబట్టీ ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఫెసిలిటేట్ చేస్తాం. ధాన్యం సేకరణ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే. ఇదే విషయం గతంలో అనేక సార్లు చెప్పాం. ఆయా రాష్ట్రాల్లో పండిన పంటలో స్థానికంగా రైతులు, ప్రజల అవసరాలకు పోనూ మిగిలిన పంటలో కొనుగోలు కేంద్రాలకు ఎంత వస్తే అంత కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వానిదే. తెలంగాణలో యాసంగిలో వచ్చే వడ్లను యథాతథంగా తీసుకోవాలి. పంజాబ్లో ఎలా తీసుకుంటున్నారో అలాగే తీసుకుంటామని చెబుతున్నారు. పంజాబ్లో వానాకాలం మాత్రమే వరి పండిస్తారు. రెండో సీజన్లో గోధుమలు పండిస్తారు. గోధుమలు పిండి పట్టిస్తారా? పత్తి బేళ్లు చేసి ఇస్తేనే తీసుకుంటున్నారా? కంది పప్పు, మినప్పప్పు, శనగపప్పు.. పప్పు పట్టిచ్చి ఇస్తేనే తీసుకుంటున్నారా? వడ్లను కూడా వడ్లలాగానే తీసుకోవాలి. తెలంగాణలో యాసంగిలో వచ్చే వడ్లు యథాతథంగా తీసుకుని డబ్బులు చెల్లించాలి’’ అని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
‘‘కేంద్ర ప్రభుత్వం తీరు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు చెప్పిన విషయాలనే మేము ఇప్పుడు ప్రస్తావిస్తున్నాం. తెలంగాణ వినతిపై కేంద్రం స్పందించలేదు. తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేకం అని కేంద్ర మంత్రి అన్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నందుకు రైతు వ్యతిరేకులమా?దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, సాగునీరు ఇస్తున్నందుకు రైతు వ్యతిరేకులమా? పండిన పంట కొనకుండా ఇబ్బందులు పెడుతున్నారు. పంట పెట్టుబడి పైసా ఇవ్వకుండా మాపైనే అభాండాలు వేస్తున్నారు. గోదాముల్లో మురిగిపోతున్న ధాన్యాన్ని పేదలకు పంచవచ్చు కదా.. కరోనా సమయంలో పేదలకు 6 కిలోలకు బదులుగా 60 కిలోలు ఇవ్వాల్సింది. కేంద్రం మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడ్డాయి. కష్టపడి 25 లక్షల ఎకరాల్లో వరిసాగు తగ్గించగలిగాం. వరిసాగు తగ్గించాలని మేమంటే.. పెంచాలని భాజపా చెప్పింది. వరి వేయమన్న పెద్దమనిషి కొనుగోలు చేయించాలి. కేంద్ర ప్రభుత్వ ధోరణి ఇలానే కొనసాగితే.. ఏదో రోజు ప్రజలు మోదీ సర్కార్ను ఇంటికి పంపించే రోజు వస్తుంది’’ అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: షాకింగ్! ఆసుపత్రిలో శిశువును ఎత్తుకెళ్లిన శునకాలు.. ఆపై విషాదం!
-
World News
viral video: జోర్డాన్లో విషవాయువు లీక్.. 13 మంది మృతి
-
General News
Health: పాడైన చిగుళ్లను బాగు చేసుకోవచ్చు..ఎలానో తెలుసా..?
-
India News
Mohammed Zubair: జర్నలిస్ట్ జుబైర్కు నాలుగు రోజుల పోలీసు కస్టడీ
-
Sports News
Wimbledon 2022: స్టార్ ఆటగాడికి కరోనా పాజిటివ్.. టోర్నీ నుంచి ఔట్..
-
India News
Agnipath: అగ్నిపథ్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం: పంజాబ్ సీఎం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra Crisis: ‘మహా’ సంక్షోభంలో కీలక మలుపు.. గవర్నర్ను కలిసిన ఫడణవీస్
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు
- ‘Disease X’: డిసీజ్ ఎక్స్.. ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు..?
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Johnny Depp: డిస్నీ వరల్డ్లోకి జానీ డెప్.. రూ.2,535 కోట్ల ఆఫర్ నిజమేనా?
- Andhra News: ఏపీ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో రూ.800 కోట్లు మాయం
- Ire vs Ind: ఉత్కంఠ పోరులో టీమ్ఇండియా విజయం.. సిరీస్ కైవసం
- Ire vs Ind: దీపక్ ధనాధన్ సెంచరీ.. ఐర్లాండ్ ముందు కొండంత లక్ష్యం
- Rocketry: ఆ ఉద్దేశంతోనే ‘రాకెట్రీ’ తీశా.. వారంతా భారత్కు తిరిగిరావాలి: మాధవన్