AP News:నన్ను చంపేందుకు రెక్కీ నిర్వహించారు: వంగవీటి రాధా

తనను చంపడానికి కొందరు రెక్కీ నిర్వహించారని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడ్లవల్లేరు మండలం చిన్నగొన్నూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వంగవీటి రంగా విగ్రహావిష్కరణ..

Updated : 26 Dec 2021 17:19 IST

గుడ్లవల్లేరు: తనను చంపడానికి కొందరు రెక్కీ నిర్వహించారని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడ్లవల్లేరు మండలం చిన్నగొన్నూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, రాధా పాల్గొన్నారు. ముగ్గురు నేతలు కలిసి రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాధా ఉద్వేగ భరితంగా ప్రసంగించారు. ‘‘నన్ను చంపడానికి కొందరు రెక్కీ నిర్వహించారు. నన్ను ఏదో చేద్దాం అనుకునే వారిని చూసి భయపడను. దేనికైనా సిద్ధమే. ప్రజల మధ్యే తిరుగుతా. వంగవీటి రాధా లేకుండా చేయాలనుకునే  వారిని ప్రజలు దూరం పెట్టాలి’’ అని పేర్కొన్నారు. రాధా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ఎవరినుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని