Navjot Singh Sidhu: నా పోరాటమంతా నిజం కోసమే..!
పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేసి, ఆశ్చర్యపర్చిన నవజోత్ సింగ్ సిద్ధూ.. బుధవారం ట్విటర్ వేదికగా వీడియో సందేశం ఇచ్చారు. ‘నా తుదిశ్వాస వరకు నిజం కోసమే పోరాడతాను’ అని అన్నారు. అవినీతి మరకలు అంటిన నేతల్ని ప్రభుత్వంలోకి అనుమతించబోమని వ్యాఖ్యలు చేశారు.
పీసీసీ పదవికి రాజీనామా చేసిన అనంతరం ట్విటర్లో సిద్ధూ స్పందన
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్(పీసీసీ) పదవికి రాజీనామా చేసి అందరినీ షాక్కు గురిచేసిన నవజోత్ సింగ్ సిద్ధూ.. బుధవారం ట్విటర్ వేదికగా వీడియో సందేశం ఇచ్చారు. ‘నా తుదిశ్వాస వరకు నిజం కోసమే పోరాడతాను’ అని అన్నారు. అవినీతి మరకలు అంటిన నేతల్ని ప్రభుత్వంలోకి అనుమతించబోమని వ్యాఖ్యలు చేశారు.
‘ఇది వ్యక్తిగత విషయాల కోసం జరిగే యుద్ధం కాదు. సిద్ధాంతాల కోసం జరిపే పోరాటం. నేను సిద్ధాంతాల విషయంలో రాజీ పడను. అవినీతి మరకలు అంటిన మంత్రులను తిరిగి తీసుకురావడానికి నేను ఏ మాత్రం అంగీకరించలేను’ అని ఆ వీడియోలో సిద్ధూ తన రాజీనామా వెనుక గల కారణాన్ని వెల్లడించారు. అలాగే ఆయన రాజీనామాపై వెనక్కి తగ్గే యోచనలో లేనట్లు సన్నిహిత వర్గాల సమాచారం.
గత కొద్ది నెలలుగా పంజాబ్ కాంగ్రెస్ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడం, చరణ్జిత్ సింగ్ చన్నీ ఎంపిక కావడం.. వంటి కీలక వ్యవహారాల్లో సిద్ధూ పాత్రే ప్రధానం. అయితే చన్నీ తన కేబినెట్లో చేర్చుకున్న మంత్రుల విషయంలో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇసుక మైనింగ్ కుంభకోణంలో రానా గుర్జిత్ సింగ్ పాత్రపై ఆరోపణలున్నాయి. ఇప్పుడు చన్నీ తిరిగి ఆయన్ను కేబినెట్లోకి చేర్చుకున్నారు. ఈ ఆరోపణలతోనే 2018లో కెప్టెన్ కేబినెట్ నుంచి ఆయన వైదొలిగారు. అయితే ఆ ఆరోపణలు అవాస్తవమని విచారణ కమిటీ తేల్చింది. ఇదిలా ఉండగా.. కొద్ది నెలల్లో ఎన్నికలకు వెళ్లనున్న పంజాబ్కు తాజా పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దేశంలో సురక్షితమైన సీటు లేదని, భవిష్యత్తులో ఆయన మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
కేరళలోని వయనాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, భాజపాపై విమర్శలు గుప్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!